పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

Mana Enadu :  దేశవ్యాప్తంగా ప్రజలంతా దీపావళి (Diwali) వేడుకల్లో నిమగ్నమయ్యారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారు. పండుగ పూట వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన కుటుంబ సభ్యులంతా ఒక చోటుకు చేరి వేడుక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో దీపావళి వేళ ఉత్తర్​ప్రదేశ్​లోని బదాయూ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

జిల్లాలోని ముజారియా పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై టెంపో, పికప్ వ్యాన్ ఢీ కొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  జిల్లాలోని ముజారియా పోలీస్ స్టేషన్​ సమీపంలో దిల్లీ- బదాయూ హైవేపై ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజాము 3 గంటలకు టెంపో, పికప్ వ్యాన్ ఢీ కొన్నాయి. ఒక్కసారిగా ఆర్తనాదాలు వినిపించడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప్రమాదం జరిగిన తీరును గమనించారు. 

వెంటనే పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. వారు వచ్చేలోగా సహాయక చర్యలు ప్రారంభించారు. పలువురిని రక్షించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను శవపరీక్షల కోసం తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *