Covid-19: ఏపీలో తొలి కరోనా కేసు నమోదు.. అప్రమత్తమైన సర్కార్

దేశంలో కరోనా కేసులు(Corona Cases) మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్‌(AP)లో తొలి కరోనా పాజిటివ్ కేసు(Positive Case) నమోదై ప్రజల్లో ఆందోళన పెరిగింది. విశాఖపట్నం (Vizag) మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా ఆమెకు జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి వెళ్లింది. అనుమానం వచ్చిన వైద్యులు RTPCR పరీక్ష నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. సదరు మహిళతో పాటు ఆమె భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు కొవిడ్ పరీక్ష(covid test) చేశారు. వారంతా నెగటివ్‌గా తేలారు. కాగా మహిళను వైద్యులు వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌(Quarantine)లో ఉండాలని సూచించారు.

Covid-19 Back In News: Are We Physically And Mentally Ready For Another  Wave Of Pandemic? - News18

దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు

కరోనా కేసులు మళ్లీ కనిపిస్తున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ(Health Department) విజ్ఞప్తి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు(Masks) తప్పనిసరిగా ధరించాలన్న ఆరోగ్య శాఖ, శానిటైజర్ వినియోగాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తోంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఇటు తెలంగాణ సర్కార్(Telangana Govt) కూడా అప్రమత్తమైంది. కరోనా పట్ల ప్రజలు జాగ్రతగా ఉండాలని సూచించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్(Carona Positive) కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధిక కేసులు గుర్తించారు.

Covid-19 cases cross 250 mark in India: Should you worry about JN.1  variant? | Health News - Business Standard

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *