కర్తార్‌పుర్‌ కారిడార్‌పై భారత్‌, పాక్‌ కీలక నిర్ణయం

Mana Enadu : కర్తార్‌పుర్‌ కారిడార్‌ (Kartarpur Corridor)పై భారత్‌, పాక్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నడవాపై ఉన్న ఒప్పందాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించాయి. ఇందుకు అంగీకరించినట్లు ఇరు దేశాలు తాజాాగా ప్రకటించాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన భారత విదేశాంగ శాఖ.. ఈ నడవాను ఉపయోగించుకునే భక్తులపై ఎలాంటి రుసుం విధించవద్దని పాక్‌ను కోరినట్లు తెలిపింది.

ఒక్కరికి 20 డాలర్ల రుసుం

ఈ నడవా(Nadawa)ను ఉపయోగించుకుంటున్న భక్తులపై పాకిస్థాన్ ప్రతి ఒక్కరి నుంచి 20 డాలర్లను సర్వీస్‌ రుసుం కింద వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది భక్తులకు భారంగా మారుతుండటంతో.. రుసుం విధించొద్దని కోరింది. ఇక ఈ కారిడార్‌ పొడిగింపు నిర్ణయం వల్ల భక్తులు నిరంతరాయంగా ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతుందని విదేశాంగ శాఖ వెల్లడించింది.

సిక్కుల పవిత్ర ప్రాంతం

భారత్‌లోని డేరా బాబా నానక్‌ నుంచి పాక్‌లోని నరోవాల్‌ జిల్లాలో ఉన్న గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను కలుపుతూ ఈ కారిడార్‌(Kartarpur Corridor) నిర్మాణం జరిగింది. సిక్కుల గురువు గురునానక్‌ తన చివరి రోజుల్లో ఇక్కడ నివసించడంతో వారు ఈ ప్రాంతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. గురునానక్‌ 550వ జయంతి (Gurunanak Jayanthi) సందర్భంగా 2019 నవంబర్‌ 9న ఈ కారిడార్‌ను ప్రధాని మోదీ ప్రారంభించగా.. 2019 అక్టోబర్‌ 24న ఐదేళ్ల పాటు భారత్‌, పాక్‌లు ఈ నడవాపై ఒప్పందం కుదుర్చుకున్నాయి.

భారతీయులు వీసా లేకుండానే

తాజాగా ఐదేళ్ల ఒప్పందం ముగిసిపోవడంతో మరో ఐదేళ్ల పాటు కాలపరిమితిని పెంచుతూ ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. భారతీయులు ఎలాంటి వీసా(Visa) అవసరం లేకుండానే ఈ నడవా ద్వారా పాక్‌లోని పవిత్ర గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను దర్శనం చేసుకోవచ్చు. పార్లమెంట్‌ నివేదిక ప్రకారం.. 2022 వరకు 1,10,670 మంది భారత్‌తోపాటు, విదేశాల్లో ఉంటున్న భక్తులు ఈ కారిడార్‌ను ఉపయోగించుకున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *