Border Gavaskar Trophy : ముగిసిన రెండో రోజు ఇన్నింగ్స్​.. ఆసీస్ స్కోరు ఎంతంటే?

Mana Enadu : గబ్బా టెస్టుపై (AUS vs IND) ఆస్ట్రేలియా పట్టు సాధిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించేలా కనిపిస్తోంది. ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో 400పై చిలుకు స్కోరు చేసి పటిష్ఠ స్థితికి చేరింది. ట్రావిస్‌ హెడ్‌ (Travis Head), స్టీవ్​ స్మిత్ జోడీ నాలుగో వికెట్‌కు ఏకంగా 241 పరుగులు జోడించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్​ 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. వికెట్​ కీపర్​ అలెక్స్ కేరీ (45), మిచెల్ స్టార్క్ (7) క్రీజులో ఉన్నారు.

టీమిండియా స్టార్​ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit bumrah)లేకుండా భారత్​ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదే. అతడు మరోసారి భారత్​ బౌలింగ్​ దళానికి వెన్నుముకలా నిలిచాడ. ఆసీస్​ కోల్పోయిన 7 వికెట్లలో 5 వికెట్లు అతడే పడగొట్టాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం అతడి కెరీర్‌లో ఇది 12వ సారి.

నాథన్ మెక్‌స్వీనీ (9), ఉస్మాన్ ఖవాజా (21), మార్నస్ లబుషేన్ (12), స్టీవ్​ స్మిత్​ (101), ట్రావిస్​ హెడ్​ (152), మిచెల్​ మార్ష్​ (5), అలెక్స్​ కేరీ (45), ప్యాట్​ కమిన్స్​ (20), మిచెల్​ స్టార్క్​ (7). బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్​, నితీశ్​ కుమార్​ రెడ్డి తలో వికెట్​ తీశారు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *