జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవేట.. ఎదురుకాల్పుల్లో సైనికుడి వీరమరణం

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం అప్రమత్తమైంది. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు ఇంకా పలు ప్రాంతాల్లో నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం నుంచి కొనసాగుతున్న ఈ కూంబింగ్ లో తాజాగా భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఉదమ్‌పుర్‌ లో ఉగ్రవేట

జమ్మూకశ్మీర్ లోని ఉదమ్‌పుర్‌ (Udhampur)లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భధ్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే దుడు-బసంత్‌గఢ్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ లో ఓ సైనికుడు అమరుడయ్యాడని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్‌ వెల్లడించింది (Udhampur Encounter).

భారత సైనికుడి వీరమరణం

నిఘా సమాచారంతో ఉదమ్‌పుర్‌లోని బసంత్‌గఢ్‌లో సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి ఉగ్రవాదులను ఏరివేసేందుకు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల ఆనవాళ్లు కనిపించడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఉగ్రవాదులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో తూటాలు తగిలి ఓ సైనికుడు గాయపడ్డాడు. చికిత్స పొందుతూ జవాన్ మరణించాడని ఆర్మీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *