త్వరలోనే దిల్లీ సీఎం అరెస్టు : కేజ్రీవాల్‌

Mana Enadu : దేశ రాజధాని దిల్లీ (Delhi)లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హస్తినలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. మరోసారి రాజధానిలో గద్దెనెక్కాలని అధికార ఆప్ పార్టీ ఉవ్విళ్లూరుతుంటే.. ఈసారైనా అక్కడ జెండా పాతాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. రోజురోజుకు దిల్లీలో రాజకీయం రాజుకుంటున్న వేళ ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కీలక వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే దిల్లీ సీఎం అరెస్టు

దిల్లీ సీఎం అతిశీ (Atishi)ని త్వరలోనే అరెస్టు చేస్తారని కేజ్రీవాల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సంచలన పోస్టు పెట్టారు. ఆప్ తీసుకొచ్చిన మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి పథకాలు కొందరికి నచ్చలేదని.. అందుకే ఓ తప్పుడు కేసులో త్వరలో ముఖ్యమంత్రి అతిశీని ఆరెస్టు చేస్తారని ఆయన జోస్యం చెప్పారు. అంతకంటే ముందు ఆప్ సీనియర్ నాయకుల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.

మహిళలకు ప్రతినెల రూ.2,100

మరోవైపు ఎన్నికల నేపథ్యంలో.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ‘మహిళా సమ్మాన్‌ యోజన’ కింద మహిళలకు ప్రతినెలా రూ.2,100 ఆర్థికసాయం చేస్తామని ఆప్‌ (AAP) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ‘సంజీవని యోజన’ స్కీమ్ కింద దిల్లీలోని సీనియర్‌ సిటిజన్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీలిచ్చి.. ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం కూడా షురూ చేసింది.

మాకు నోటిఫై చేయలేదు

మరోవైపు ఈ పథకాలకు సంబంధించి దిల్లీ వాసులను అప్రమత్తం చేస్తూ ఇటీవల ఓ వార్తా పత్రికలో ప్రకటన వెలువడింది. ‘మహిళా సమ్మాన్ యోజన కింద దిల్లీలోని మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని ఓ రాజకీయ పార్టీ చెబుతోందని మీడియా కథనాల ద్వారా మా దృష్టికి వచ్చింది. దిల్లీ ప్రభుత్వం అలాంటి స్కీమ్‌ను మాకు నోటిఫై చేయలేదు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో సంజీవని పథకం లేదు.’ అని మహిళా, శిశు అభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలు పేర్కొనడంతో తాజాగా కేజ్రీవాల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *