KCRతో కేటీఆర్ భేటీ.. కవిత లేఖపై చర్చ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో (Erravelli Farmhouse) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండు మూడు రోజుల నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలు వివరించేందుకు కేసీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల కిందట కవిత కేసీఆర్ కు రాసిన లేఖ (Letter Politics) బయటపడగా.. దాన్ని తానే రాశానని అది ఎలా బయటకు వచ్చిందో తెలియదని కవిత మీడియా ఎదుట అన్నారు. దీంతో పాటు కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

దెయ్యాలు ఎవరు?

 

కేసీఆర్ దేవుడని, దెయ్యాలు చుట్టూ ఉన్నాయని అనడంతో అసలు దెయ్యాలు ఎవరూ అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేసీఆర్ కు అత్యంత దగ్గరగా ఉండేది కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) కవిత మాత్రమే ఆ తర్వాత సంతోష్ రావు, వీరు కాకుండా ఎవరూ ఆయనకు దగ్గరగా ఉంటారు. అసలు కవిత ఎందుకు అనాల్సి వచ్చింది. ఎవరిని ఉద్దేశించి కవిత వ్యాఖ్యలు చేసిందనేది ఇప్పుడు తేలాల్సిన అంశం.

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై చర్చ

 

త్వరలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవిత తెలంగాణ భవన్ కు వస్తారా రారా అనే చర్చ సాగుతోంది. కాగా కేసీఆర్ తో కేటీఆర్ ప్రత్యేక సమావేశంలో కవిత రాసిన ఉత్తరం, దాన్ని ఎవరూ లీక్ చేశారు. ఎందుకు కవిత బహిరంగంగా మాట్లాడుతోంది. కొత్త పార్టీ తెలంగాణలో కవిత తీసుకురానుందా.. తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్ 1న అమెరికాలో జరగబోయే ప్రత్యేక కార్యక్రమానికి కేటీఆర్ వెళ్లనున్న సందర్భంగా కేసీఆర్ ను కలిసి పార్టీ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. కవిత (Kavitha) విషయంలో వేచి చూసే ధోరణి అవలంభించాలా.. లేక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎలాంటి పరిణామాలు పోతాయి తదితర అంశాలు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి కొద్ది రోజుల్లో కవిత అంశం తేలిపోనుందని రాజకీయ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *