మందకృష్ణ మాదిగకు షాక్.. ఆ కట్టడాలపైకి బుల్డోజర్లు

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga)కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్‌ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన అక్రమ కట్టడాలపై బుల్డోజర్లను పంపారు. హనుమకొండలోని హంటర్‌ రోడ్డు సర్వే నంబరు 125కేలోని 400 గజాల నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.

అవి ఆక్రమణలే

హంటర్‌ రోడ్డులో తమకు చెందిన 400 గజాలను మందకృష్ణ మాదిగతో పాటు జ్యోతి, ఇద్దయ్యలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని అధికారులకు ఫిర్యాదు వచ్చింది. నంబూరి చారుమతి అనే మహిళ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు దీనిపై విచారణ చేపట్టారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా.. ఆక్రమణ నిజమేనని తేలడంతో కట్టడాలను కూల్చేయాలని (Demolitions) 2022 సెప్టెంబరులో ఆదేశాలు ఇచ్చారు.

కట్టడాలు నేలమట్టం

అయితే ఈ నిర్మాణాలు రెండేళ్లు దాటినా కూల్చలేదని చారుమతి ఇటీవల.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించారు. ఈ మేరకు జనవరి 24వ తేదీలోగా నిర్మాణాలను నేలమట్టం చేయాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ హైకోర్టును ఆశ్రయించినా ఆయనకు ఊరట దక్కలేదు. దీంతో మున్సిపల్‌ సిబ్బంది రంగంలోకి దిగి శుక్రవారం రోజున కట్టడాలను నేలమట్టం చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *