తిరుమల లడ్డూ వివాదం.. స్వతంత్ర సిట్‌ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం

Mana Enadu : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం (Tirumala Laddu Controversy) తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తోంది. అయితే ఈ వ్యవహారం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరడంతో సిట్ దర్యాప్తునకు ఇటీవల తాత్కాలిక బ్రేక్ పడింది.

స్వతంత్ర సిట్ ఏర్పాటు

ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వ్యవహారంపై ఇవాళ (అక్టోబర్ 4వ తేదీ) సుప్రీంకోర్టు విచారణ జరిపింది.  ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ (Independent SIT) ఏర్పాటు చేయాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం (AP Govt) తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్‌ అధికారి సభ్యులుగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. స్వతంత్ర సిట్‌ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్‌ (CBI Director) పర్యవేక్షిస్తారన్న సర్వోన్నత న్యాయస్థానం.. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

భక్తుల మనోభావాలకు చెందిన విషయం

ఇక అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలుపుతూ..  ఇది భక్తుల మనోభావాలకు చెందిన విషయమని.. దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిట్‌ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవ్న ఆయన.. స్వతంత్ర విచారణ కోరుకుంటున్నారు కాబట్టి.. సీనియర్‌ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుందని కోర్టుకు విన్నవించారు.

మరోవైపు పిటిషనర్లలో ఒకరైన YSRCP MP, TTD మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని.. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దని వ్యాఖ్యానించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *