ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ 3 శాతం పెంపు..?

సర్కార్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) తీపికబురు అందించబోతున్నట్లు సమాచారం. ఈ హోలీ పండుగకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలిసింది. ఈ పండుగ సందర్భంగా డీఏను (కరవు భత్యం) సరవణ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసారి కూడా డీఏను మరో 3 శాతం పెంచనున్నట్లు వెల్లడించాయి. దీంతో ప్రస్తుతం 53 శాతంగా ఉన్న డీఏ 56 శాతానికి చేరనుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

14వ తేదీన అధికారిక ప్రకటన

మార్చి 14వ తేదీన హోలీ పండుగ సందర్భంగా డీఏ (DA) పెంపుపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం 7వ వేతన సంఘం (7th Pay Commission) సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర సర్కార్ ప్రతి సంవత్సరం రెండు సార్లు ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచాల్సి ఉంటుంది. జనవరి, జులైల్లో డీఏ పెంపు జరగాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మార్చి, అక్టోబరులో ప్రకటిస్తోంది. అయితే ప్రకటనలో ఆలస్యమైనా.. బకాయిలతో కలిపి చెల్లిస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *