KINGDOM: అభిమానులకు షాక్.. విజయ్ ‘కింగ్డమ్’ రిలీజ్ వాయిదా!

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన నటించిన కింగ్‌డమ్ (KINGDOM) మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 30వ తేదీన విడుదల కావాల్సిన మూవీని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కొంత కాలంగా ఫ్లాపులతో ఉన్న విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డమ్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

జులై 4వ తేదీకి వాయిదా

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నింగ్డమ్ మూవీని నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే (bhagyashri borse) క‌థానాయిక. అన‌రుధ్ సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా విష‌యంలో గ‌త ప‌ది, ప‌దిహేను రోజులుగా వినిపిస్తున్న‌ వార్త‌లు నిజ‌మయ్యాయి. ఈనెల 30న రిలీజ్ చేయడానికి అన్నీ ప్లాన్ చేసుకున్నా.. ప్రస్తుతమున్న పరిస్థితుల కారణంగా జులై 4వ తేదీకి వాయిదా వేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఊహించని ఘటనల కారణంగా.. 

‘‘మా ప్రియమైన ప్రేక్షకులకు.. మే 30న విడుదల కావాల్సిన మా ‘కింగ్‌డమ్‌’ సినిమాను జూలై 4న విడుదల చేయనున్నామని తెలియజేస్తున్నాము. ముందుగా అనుకున్నట్టుగా మే 30వ తేదీకే సినిమాని తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాము. కానీ మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్లు, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’’ అని పేర్కొన్నారు. ‘ఈ నిర్ణయం కింగ్‌డమ్ సినిమాకు మరిన్ని మెరుగులు దిద్ది, సాధ్యమైనంత ఉత్తమంగా మలచడానికి సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. కాస్త ఆలస్యంగా వచ్చినా ‘కింగ్‌డమ్‌’ చిత్రం అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంద‌ని ఆశిస్తున్నాం’ అని పేర్కొంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *