చలి చంపుతోంది.. పొగమంచులో జర్నీ జర భద్రం గురూ

ManaEnadu : శీతాకాలం (Winter Season) మొదలైంది. నవంబరు మొదటి వారంలో చలి వణికిస్తోంది. ఇక తెల్లవారుజామున భారీగా పొగమంచు కురుస్తోంది. అయితే పొగమంచు (Fog) కురుస్తున్న సమయంలో ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమమని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ ప్రయాణించాల్సి వస్తే చాలా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ప్రతి ఏటా నవంబరు, డిసెంబరు, జనవరి మాసాల్లో పొగమంచు కారణంగా రహదారి, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున ప్రయాణం చేసే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..?

పొగమంచులో ప్రయాణం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఉదయం 8 గంటల్లోపు.. అర్ధరాత్రి దాటిన తర్వాత దూర ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమం.
పొగమంచు కురుస్తున్న సమయంలో ప్రయాణం చేయాల్సి వస్తే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలి.
పొగమంచులో వాహనం నడిపేటప్పుడు ఇతరులకు స్పష్టంగా కనిపించేలా లైట్లు ఆన్‌ చేసి ఉంచాలి.
ఫాగ్ లైట్స్ (Fog Lights) తప్పనిసరిగా ఆన్ చేయాలి.
హైవేలు, శివారు రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు వాహనాల మధ్య కచ్చితమైన దూరం పాటించాలి.
విండ్‌ స్కీన్ర్ (Wind Screen), సైడ్‌ అద్దాలపై మంచు పొరను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి.
పొగమంచు కురుస్తున్నప్పుడు వాహన సామర్థ్యం సరిగా ఉండేలా చూసుకోవాలి.
తెల్లవారుజాము ప్రయాణించే ముందు వైపర్లు సరిగా పనిచేస్తున్నాయా? బ్రేకులు సమస్యల్లేకుండా ఉన్నాయా? అనేది చెక్ చేస్కోవాలి.
కారులో వెళ్లేటప్పుడు హీటర్‌ను యూజ్ చేస్తే ముందు అద్దాలు ఆవిరిపట్టకుండా ఉంటాయి.
ఇన్ని జాగ్రత్తలు పాటించినా రోడ్డు స్పష్టంగా కనిపించకపోతే సురక్షితమైన స్థలంలో వాహనాన్ని నిలపివేయాలి.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *