అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ఆ తేదీల్లో కాచిగూడ నుంచి 4 ప్రత్యేక రైళ్లు

 అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. శబరిమల (Sabarimala) వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కడప మీదుగా కేరళలోని కొట్టాయం, కొల్లాం ప్రాంతాలకు ఈ నెలలోనే 4 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఈ నెల 14, 21, 28 తేదీల్లో 07133 నంబరు గల రైలు కాచిగూడలో మధ్యాహ్నం 3.40 గంటలకు బయల్దేరనుంది.

కాచిగూడ నుంచి రైలు

అదేరోజు రాత్రి 12.10 గంటలకు కడపకు చేరుకుంటుందని కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టరు ఎ.జనార్దన్‌ వెల్లడించారు. ఆ తర్వాత రోజు సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు కొట్టాయం చేరుకుంటుందని.. తిరుగు ప్రయాణంలో 07134 గల రైలు ఈనెల 15, 22, 29 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కొట్టాయం నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కడపకు చేరుకుంటుందని తెలిపారు. ఆ రాత్రి 11:40 నిమిషాలకు కాచిగూడ(Kachiguda Station)కు వచ్చేస్తుందని పేర్కొన్నారు.

హైదరాబాద్ నుంచి ఓ రైలు

మరోవైపు ఈ నెల 19, 26వ తేదీల్లో హైదరాబాద్‌లో 07135 నంబరు గల రైలు మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి రాత్రి 10.25 గంటలకు కడప(Kadapa Train)కు చేరి.. మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07136 నంబరు రైలు ఈ నెల 20, 27 తేదీల్లో సాయంత్రం 6.10 గంటలకు కొట్టాయంలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 11.50 గంటలకు కడప.. రాత్రి 11 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ చేరుతుంది.

నాందేడ్ నుంచి మరో రైలు 

07139 నంబర్​ రైలు ఈ నెల 16న ఉదయం 8.20 గంటలకు  నాందేడ్ (Nanded)​ నుంచి బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2.50 గంటలకు కడప.. రాత్రి 10. 30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 18న మరో రైలు (07140) తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాంలో బయలుదేరి అదే రోజు రాత్రి 11 గంటలకు కడప.. మరోసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

మౌలాలీ నుంచి ఓ రైలు

హైదరాబాద్‌ మౌలాలీలో ఈ నెల 23, 30న 07141 నంబరు గల రైలు మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి తర్వాత రోజు తెల్లవారుజామున 2.50 గంటలకు కడప చేరుకుంటుంది. రాత్రి 10.30 గంటలకు కొల్లాం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, డిసెంబర్​ 2వ తేదీల్లో 07142 నంబర్​ రైలు కొల్లాంలో తెల్లవారుజామున 2.30 గంటలకు బయల్దేరి, అదే రోజు రాత్రి 11 గంటలకు కడపకు, మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మౌలాలీకి చేరుతుంది.

Related Posts

SCR: ప్రయాణికులకు ఊరట.. 48 స్పెషల్ ట్రైన్స్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) శుభవార్త అందించింది. ఇటీవల రైళ్ల రద్దు, దారి మళ్లింపు, స్టేషన్ల పునర్మిణానం, మూడో లైన్ పనులు, ఇతర స్టేషన్లనుంచి రాకపోకలు అంటూ ప్రయాణికులను(Passengers) విసిగించిన రైల్వే శాఖ(Railway Department) తాజాగా ప్రయాణికులకు కాస్త…

Railway New Fares: రైలు ప్రయాణికులకు షాక్.. అమలులోకి పెరిగిన ఛార్జీలు

దేశ వ్యాప్తంగా రైల్వే ఛార్జీలు(Railway Fares) పెరిగాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు(Charges) అమలులోకి వచ్చాయి. రైలు ఛార్జీలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం(Central Govt) నిర్ణయించినట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై అధికారిక ప్రకటన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *