హైదరాబాద్(HYD) నగరంలోని గోషామహల్ స్టేడియం(Goshamahal Stadium)లో కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా హాస్పిటల్(Osmania Hospital) పరిసరాల అభివృద్ధి ప్రణాళికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రిని అక్కడి నుంచి తరలించి గోషామహల్ స్టేడియంలో కొత్తగా నిర్మించనున్న నేపథ్యంలో సంబంధిత ప్రణాళికలపై సీఎం రేవంత్ ఉన్నతాధికారుల(of superiors)తో సమీక్షించారు.
మౌలిక వసతులపై ఫోకస్ చేయండి
అలాగే ఆసుపత్రి(Hospital)కి ప్రధానంగా మెరుగైన రవాణా వ్యవస్థ(Transportation system) ఉండాలని సూచించారు. రహదారు(Roads)ల విస్తరణకు వెంటనే సర్వే పనులను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో అన్ని శాఖలతో సమన్వయం కోసం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ను నోడల్ అధికారి(Dana Kishore as the nodal officer)గా సీఎం రేవంత్ నియమించారు. ఆసుపత్రికి ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థల(Electricity and drainage systems)ను అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, కలెక్టర్ అనుదీప్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరంలోని గోషామహల్ స్టేడియంలో కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా హాస్పిటల్ పరిసరాల అభివృద్ధి ప్రణాళికలను పరిశీలించిన ముఖ్యమంత్రి @revanth_anumula గారు అధికారులకు పలు సూచనలు చేశారు. ఉస్మానియా ప్రస్తుత ఆసుపత్రిని అక్కడి నుంచి మార్చి గోషామహల్ స్టేడియంలో కొత్తగా నిర్మించనున్న… pic.twitter.com/ATSNEMeGhd
— Telangana CMO (@TelanganaCMO) December 1, 2024