వీడిన ఉత్కంఠ.. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్

Mana Enadu : మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తాజాగా ఉత్కంఠ వీడింది. బీజేపీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) పేరును మహారాష్ట్ర నూతన సీఎంగా ఖరారు చేశారు.

మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్

ఈ మేరకు బుధవారం జరిగిన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో ఫడణవీస్‌ పేరును ప్రతిపాదించారు. దీంతో ఆయన పేరును కోర్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబరు 5వ తేదీన ఆయన మహారాష్ట్ర (Maharashtra) సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడించాయి. (Maharashtra Next CM). కోర్‌ కమిటీ భేటీ తర్వాత ముంబయిలోని విధాన్‌ భవన్‌లో బీజేపీ (BJP) శాసనసభాపక్ష సమావేశం జరిగింది.

5న మహా సీఎం ప్రమాణం

ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా ఉన్న నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman), విజయ్‌ రూపానీ హాజరై.. సీఎం ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడణవీస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం రోజున ఆజాద్‌ మైదానంలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ (PM Modi) సహా ఎన్డీయే కీలక నేతలు హాజరు కానున్నారు. ఇక మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్‌తో పాటు శివసేన నేత ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde), ఎన్సీపీ నేత అజిత్ పవార్‌ (Ajit Pawar) ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఫలించిన బుజ్జగింపులు

288 శాసనసభ స్థానాలున్న మహారాష్ట్రలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఏకంగా 230 స్థానాలతో భారీ మెజార్టీ దక్కించున్నా సీఎం ఎంపిక, శాఖల కేటాయింపులపై బీజేపీ, శివసేన, ఎన్సీపీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించని ఏక్‌నాథ్‌ శిందే, హోంశాఖ కేటాయించాలని పట్టుబట్టగా బీజేపీ హైకమాండ్ బుజ్జగింపులు మొదలుపెట్టినట్లు వార్తలు వచ్చాయి. చివరకు చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *