అఖండ-2తో పాపులర్ హీరోయిన్ కూతురు ఎంట్రీ!

Mana Enadu : నందమూరి బాల‌కృష్ణ (Balakrishna) ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు. బాలయ్య చేతిలో ప్రస్తుతం రెండు మూడు చిత్రాలున్నాయి. అందులో ఒకటి మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శీను (Boyapati srinu) కాంబోలో వస్తోన్న అఖండ 2 (Akhanda 2). ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

బాలయ్య బాబు అఖండ-2 సినిమాతో టాలీవుడ్‌లోకి ఓ సీనియర్ నటి కూతురు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అలనాటి పాపులర్ నటి లయ (Actress Laya) కుమార్తె శ్లోక ఈ సినిమాలో నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాదాపుగా శ్లోక (Laya Daughter Shloka) ఎంట్రీ ఖాయమైనట్లు టాక్.. దీనిపై త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. ఒకవేళ అదే నిజమైతే శ్లోకకు బోయపాటి అఖండ-2లో ఎలాంటి పాత్ర ఇస్తారని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక అఖండ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి తమన్ (SS Thaman) మ్యూజిక్ అందిస్తున్నాడు. పార్ట్-1కు తమన్ ఇచ్చిన బీజీఎం ఏ రేంజులో ఉందో తెలిసిందే. ఇద సీక్వెల్ కు ఎలాంటి బీజీఎం వాయిస్తాడోనని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తప్పకుండా ఇతగాడి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రోమో కూడా ఇది నిజమేనని ప్రూవ్ చేస్తోంది.

ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమో (Akhanda 2 Promo)లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ నేల అసురుడిది కాదురా.. ఈశ్వరుడిది అంటూ బాలయ్య బాబు తనదైన శైలిలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. అఖండ-2లో బోయపాటి బాలయ్యను ఎలాంటి రౌద్ర రూపంలో చూపిస్తాడోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఫస్ట్‌ పార్టులో ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) ఫీ మేల్ లీడ్ గా నటించింది. సెకండ్ పార్టులోనూ ఆమె కీలక పాత్రలో కనిపిస్తోంది. ఇక అఖండలో శ్రీకాంత్, జ‌గ‌ప‌తిబాబు, పూర్ణ కీల‌క పాత్రలు పోషించారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *