
సౌత్ ఇండియా హీరోయిన్ నయనతార భర్త విఘ్నేశ్ (Vignesh Shivan Controversy) పాండిచ్చేరిలో (Pondicherry) ప్రభుత్వ భూమి (బంగ్లా) కొనుగోలు చేయాలని చూశాడని అది బెడిసి కొట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. నయన తార భర్త విఘ్నేష్ శివన్ పాండిచ్చేరిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హోటల్ కావాలని కోరినట్లు తెలుస్తోంది. కాగా నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. దీంతో డైరెక్టు విఘ్నేశ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
విఘ్నేశ్ శివన్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ..
విఘ్నేష్ శివన్ ( Vignesh Shivan) తమిళంలో ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తదుపరి చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ టైటిల్ తో ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్నారు. కృతి శెట్టి, సీమాన్, కెలారి కిషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, నయనతార (Nayanthara) రెడ్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఈ చిత్రంలోని దీమా దీమా అనే పాట విడుదలై వైరల్ గా మారింది. ఈ చిత్రాన్ని మరో ఎండాకాలంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రభుత్వ బంగ్లా కొనుగోలు వివాదం?
ఇటీవల పుదుచ్చేరి వెళ్లిన దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) అక్కడి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రితో సమావేశమై ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సీగల్ హోటల్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడని వార్తలు వినిపించాయి. కాగా దీనిపై మంత్రి నిరాకరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇది చూసిన నెటిజన్లు విఘ్నేష్ శివన్ పై మీమ్స్ పోస్ట్ చేస్తూ ప్రభుత్వానికి చెందిన బంగ్లా ధర ఎవరైనా అడుగుతారా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విఘ్నేష్ శివనే ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. నా సినిమా లవ్ ఇన్సూరెన్స్ షూటింగ్ అనుమతి కోసం పాండిచ్చేరి వెళ్లాను. ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిని కలిశాను. ఆ సమయంలో నాతో పాటు వచ్చిన వ్యక్తి తనకు అవసరమైన కొన్ని విషయాల గురించి ఆరా తీశారు. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని నన్ను విమర్శించి మీమ్స్ పెట్టారు. నేను ఎంజాయ్ చేశాను” అని విక్కీ వివరించారు. కాగా ఇప్పటికే ధనుష్ తో (Dhanush) వివాదంలో నయనతార, విఘ్నేశ్ పై ఇప్పటికే రూ. 10 కోట్ల నష్టపరిహారం కేసు కోర్టులో నడుస్తోంది.