థాంక్యూ మోదీ జీ.. ప్రధానికి అక్కినేని ఫ్యామిలీ ధన్యవాదాలు

Mana Enadu : ప్రధాని నరేంద్ర మోదీకి నాగచైతన్య (Naga Chaitanya) దంపతులు థాంక్స్‌ చెబుతూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్‌లు పెట్టారు. సినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రశంసలపై నాగచైతన్య, శోభితా ధూళిపాళ స్పందించారు.

మోదీ జీ థాంక్యూ 

‘‘అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని నాగచైతన్య, శోభిత (Sobhita Dhulipala) ఎక్స్ వేదికగా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ జరిగింది.. 

ఆదివారం రోజున నిర్వహించిన ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ (Narendra Modi) .. ఏయన్నార్‌, బాలీవుడ్‌ దర్శకుడు తపన్‌ సిన్హా, రాజ్‌ కపూర్‌ల సినీ ప్రస్థానాన్ని గుర్తు చేశారు. సినీ ఇండస్ట్రీకి వారందంచిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా.. తెలుగు సినిమాని అక్కినేని నాగేశ్వరరావు మరో స్థాయికి తీసుకెళ్లారని మోదీ ప్రశంసించారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలను చాలా చక్కగా చూపించేవారని తెలిపారు.

థాంక్యూ మోదీ జీ

అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గురించి మోదీ ప్రస్తావించడంపై తెలుగువారంతా ఆనందం వ్యక్తం చేశారు.  ఏఎన్నార్ తనయుడు, అక్కినేని నాగార్జున కూడా మోదీకి థాంక్స్‌ చెబుతూ పోస్ట్‌ పెట్టారు. ‘‘ఐకానిక్‌ లెజెండ్స్‌తోపాటు మా నాన్న ఏయన్నార్‌ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏయన్నార్‌ దూరదృష్టి, ఇండియన్‌ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి’’ అని నాగార్జున (Nagarjuna) ఎక్స్ వేదికగా మోదీకి థాంక్యూ చెప్పారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *