టాలీవుడ్ హీరోయిన్, బీజేపీ నేత మాధవీలతపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ ప్రాస్టిట్యూట్ అంటూ తీవ్ర కామెంట్స్ చేశారు. అసలు బీజేపీ నేతలు.. మాధవీలతను తమ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారో తెలియదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. జేసీ పార్క్ వైపు మహిళలెవరూ వెళ్లద్దొంటూ మాధవీలత చేసిన కామెంట్స్ పై జేసీ కౌంటర్ ఇచ్చారు.
మాధవీలతపై ఫిర్యాదు
ఆయన వ్యాఖ్యలను తప్పుడు పడుతూ మహిళలను అవమానించేలా మాట్లాడారని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. జేసీ పార్కులో ఎలాంటి తప్పుడు సంఘటనలు జరగడం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత (Madhavi Latha)పై టీడీపీ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే..?
అనంతపురంలో న్యూ ఇయర్ వేడుకలు (New Year 2025) దుమారం రేపాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కేవలం మహిళల కోసమే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. అయితే ఈ వేడుకలకు మహిళలు ఎవరూ వెళ్లొద్దంటూ బీజేపీ మహిళా నేతలు యామిని శర్మ, మాధవీలత (సినీ నటి) వీడియో రిలీజ్ చేశారు. అక్కడ మహిళలు సేఫ్ కాదని.. గంజాయి బ్యాచ్ ఏదైనా దాడులు చేస్తే దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ మాధవీలతపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.








