ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్ సందడి చేయనున్నారు. అదేనండి.. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అబ్బాయ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Game Changer Pre Release Event) లో ఒకే వేదికపై కనిపించనున్నారు. శంకర్ దర్శకత్వంలో చెర్రీ హీరోగా.. కియారా అడ్వాణీ ఫీమేల్ లీడ్ లో నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఇవాళ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM), పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్టుగా రానున్నారు. ఆయన ఉపముఖ్యమంత్రి హోదాలో సినిమా ఈవెంట్ కు హాజరవ్వడం ఇదే తొలిసారి.
ఒకే వేదికపై బాబాయ్- అబ్బాయ్
ఇక ఈ బాబాయ్, అబ్బాయ్ లు ఏపీ ఎన్నికల సమయంలో ప్రచారంలో ఒకే వేదికపై కనిపించారు. అప్పుడు ఇరువురి అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎం హోదాలో.. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా.. ఒకే వేదికపై సందడి చేయబోతుండటంతో ఈసారి మోత మోగాల్సిందే అంటున్నారు మెగా ఫ్యాన్స్. అబ్బాయి కోసం సపోర్టుగా బాబాయ్ వస్తుండటంతో గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు.
A groundbreaking move with the #MegaPowerEvent 💥
Get ready to witness great things today in presence of honorable Deputy CM of Andhra Pradesh @pawankalyan garu✨ today at rajahmundry
The #MegaPowerEvent is going to be MASSIVE
📍 Rajahmundry#GameChanger… pic.twitter.com/7NO67dkjnb— Game Changer (@GameChangerOffl) January 4, 2025
భారీ బందోబస్తు
ఇక పవన్ కల్యాణ్, రామ్ చరణ్ (Ram Charan) ఒకే వేదికపై కనిపించనుండటంతో భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పది అడుగుల ఎత్తులో స్టేజీ నిర్మించి.. పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. వేదిక వద్దకు ఎవరూ రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 1600 వేల మంది సిబ్బందిని బందోబస్తు నిర్వహించారు. అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు.







