లోకల్ ఛానెల్ లో ‘గేమ్ ఛేంజర్’ టెలికాస్ట్.. నిందితుల అరెస్టు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో వచ్చిన సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. జనవరి 10వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మిశ్రమ స్పందన దక్కించుకుంది. అయితే సినిమా విడుదలైన మరుసటి రోజే ఈ చిత్రం పైరసీ నెట్టింట రావడం కలకలం రేపింది. HD వెర్షన్ ఆన్ లైన్ లో అందుబాటులోకి రావడంతో చిత్రబృందం షాక్ అయింది. దీని ప్రభావం సినిమా కలెక్షన్లపై పడింది.

లోకల్ ఛానెల్ లో గేమ్ ఛేంజర్

అయితే ఈ సినిమా (Game Changer) పైరసీ కాపీని ఏకంగా ఏపీలోని ఓ ప్రాంతంలో లోకల్ ఛానల్ లో ప్రసారం చేశారు. దీనిపై చిత్రబృందం తీవ్రంగా స్పందించింది. చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను టెలికాస్ట్ చేసిన టీవీ ఛానల్‌ నిర్వాహకులపై తాజాగా గాజువాక పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

పైరసీని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు

రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబోలో ఈ సినిమా జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. దీని పైరసీ కాపీని ఓ టీవీ ఛానెల్‌లో (Local Channel) ప్రసారం చేయడంతో కేసు నమోదు చేసినట్లు గాజువాక పోలీసులు తెలిపారు. సైబర్‌ క్లూస్‌ టీమ్‌ సాయంతో వారిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. టీవీ ఛానల్‌పై దాడి చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పైరసీని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

అప్పన్న పాత్రే హైలైట్

గేమ్ ఛేంజర్ సినిమా సంగతికి వస్తే ఈ సినిమాలో రామ్ చరణ్, కియారా అడ్వానీ (Kiara Advani) ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్ జే సూర్య, అంజలి కీలక పాత్రల్లో సందడి చేశారు. ఈ మూవీలో అప్పన్నగా చెర్రీ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక అంజలి పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నెట్టింట మొత్తం అప్పన్న పాత్ర గురించే చర్చంతా నడిచింది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *