Team India: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌‌లకు జట్ల ఎంపిక

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) తర్వాత భారత జట్టు కొన్నిరోజులుగా విశ్రాంతి తీసుకుంటోంది. ఇక ఈనెల నుంచి మళ్లీ టీమ్ఇండియా(Team India) మైదానంలోకి దిగనుంది. ఈ టూర్‌లో భారత్ జట్టు ఇంగ్లండ్‌(England)తో 3ODIలు, 5 T20లు ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌కు BCCI యువ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జట్టుతో వన్డే సిరీస్, వచ్చే నెల 19 నుంచి జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)కి ఇవాళ భారత జట్టును ఎంపిక చేయనుంది.

వారిద్దరి ఫిట్‌నెస్‌పై నేడు క్లారిటీ

ముంబయిలో ఇవాళ టీమిండియా సెలక్షన్ కమిటీ(Selection Committee) సమావేశం కానుంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్(Chairman Ajit Agarkar), కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) భారత జట్లను ప్రకటించనున్నారు. ఈ సమావేశం ముగిశాక జట్లను ఖరారు చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. కాగా, ఇటీవల ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో గాయపడి మ్యాచ్ మధ్యలో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఫిట్ నెస్‌పై నేడు కెప్టెన్ స్పష్టత ఇచ్చే అవకాశముంది. అలానే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kukdeep Yadhav) ఫిట్ నెస్ పైనా ఓ క్లారిటీ రానుంది. కాగా ఇంగ్లండ్‌తో భారత్ తొలుత 5T20 మ్యాచులు ఆడనుంది. అనంతరం 3 వన్డేల్లో పోటీపడుతుంది.

India vs Sri Lanka ODI & T20I squad announcement: Meeting likely to be  rescheduled

* T20 షెడ్యూల్ ఇలా..

☛ జనవరి 22 – తొలి టీ20, కోల్‌కతా
☛ జనవరి 25 – రెండో టీ20, చెన్నై
☛ జనవరి 28 – మూడో టీ20, రాజ్ కోట్
☛ జనవరి 31 – నాలుగో టీ20, పుణే
☛ ఫిబ్రవరి 02 – ఐదో టీ20, ముంబై (అన్ని మ్యాచులు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి)

* వన్డే షెడ్యూల్ ఇలా..

☛ ఫిబ్రవరి 06 – తొలి వన్డే, నాగ్‌పూర్
☛ ఫిబ్రవరి 09 – రెండో వన్డే, కటక్
☛ ఫిబ్రవరి 12- మూడో వన్డే, అహ్మదాబాద్ (అన్ని మ్యాచులు మధ్యాహ్నం 1.30కి ప్రారంభమవుతాయి)

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *