టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం(Brahmanandam) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల తన కుమారుడు రాజా గౌతమ్(Raja Gautham) నటించిన ‘బ్రహ్మా ఆనందం(Brahma Anandam)’ మూవీ యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ చిత్రంలో బ్రహ్మీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటల(Songs)కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమం(Promotion Event)లో బ్రహ్మానందం ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇప్పటివరకు కామెడీ(Comedy), సెంటిమెంట్ పాత్రలతో అలరించిన తాను త్వరలోనే విలన్రోల్(Villain role)లోనూ కనిపిస్తానని చెప్పారు. ఆ విలనిజం థియేటర్ అంతా షేక్ అయ్యేలా ఉంటుందని అన్నారు. హాస్యభరిత పాత్రలతోనే అందరికీ చేరువైన ఆయన కొత్త పాత్రలో ఎలా సర్ప్రైజ్ చేస్తారోనని ఫ్యాన్స్(Fans) ఎదురుచూస్తున్నారు.
విలన్ క్యారెక్టర్లో బ్రహ్మానందం….😡😡#brahmanandam pic.twitter.com/KWT2fO7byk
— TeluguOne (@Theteluguone) February 3, 2025
తాతా మనవడిగా తండ్రీకొడుకులు
కాగా ‘బ్రహ్మా ఆనందం’ సినిమా విషయానికి వస్తే… ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు RVS నిఖిల్ తెరకెక్కించారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్(Swadharma Entertainment Banner)పై నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను నిర్మించారు. ప్రియా వడ్లమాని(Priya Vadlamani), ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నిజ జీవితంలో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, గౌతమ్ ఈ మూవీలో తాతా మనవడిగా నటించారు.








