IPL 2025: మరో 20 రోజుల్లో ఐపీఎల్ సంబరం.. జట్లకు BCCI కొత్త రూల్స్

మరో 20 రోజుల్లో ఐపీఎల్(Indian Premier League) రూపంలో క్రికెట్ సందడి మొదలు కానుంది. మార్చి 22న మొదలు కానున్న ఈ T20 లీగ్ సంబరం మే 25వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తం 10 జట్లు 74 మ్యాచులు ఆడనున్నాయి. దీంతో ఈ సమ్మర్ మొత్తం క్రికెట్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపనుంది. స్వదేవీ, విదేశీ క్రికెటర్ల బ్యాటింగ్ విన్యాసాలు.. ఆకట్టుకునే బౌలింగ్ స్పెల్స్ కనువిందు చేయనున్నాయి. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ(KKR vs RCB) మధ్య జరగనుంది. అయితే ఈసారి ఆయా ఫ్రాంచైజీలకు బీసీసీఐ(Board of Control for Cricket in India) కొన్ని కొత్త ఆంక్షలు విధించింది.

ఒక్కో జ‌ట్టుకు ఏడు ప్రాక్టీస్ సెష‌న్స్

కొత్త సీజన్‌కు ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జట్ల ప్రాక్టీస్ సెష‌న్ల‌(Practice Sessions)పై బీసీసీఐ రూల్స్(Rules) పెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం ఒక్కో జ‌ట్టుకు 7 ప్రాక్టీస్ సెష‌న్స్ మాత్ర‌మే ఉంటాయి. అలాగే 2 వార్మప్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంటుంది. ఇక మ్యాచ్ ఉన్న రోజుల్లో స్టేడియాన్ని ప్రాక్టీస్ కోసం ఉప‌యోగించ‌రాదు. అలాగే ఐపీఎల్ వేదిక‌ల‌లో ఇత‌ర టోర్నీల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి లేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ప్రధాన స్క్వేర్‌లోని సైడ్ వికెట్‌లలో ఒకదానిపై జరగాలి. ఫ్ల‌డ్ లైట్ల కింద కేవ‌లం 3.30 గంట‌లు మాత్ర‌మే ప్రాక్టీస్‌కు అనుమ‌తి ఉంటుంది.

ముందస్తు రాతపూర్వక అనుమతి తప్పనిసరి

అలాగే ఈ ఆపరేషనల్ రూల్స్(Operational Rules) ప్రకారం ప్రాక్టీస్ మ్యాచ్‌లకు BCCI ముందస్తు రాతపూర్వక అనుమతి తప్పనిసరి. సీజన్ కోసం పిచ్‌ను సిద్ధం చేయడానికి సంబంధిత ఫ్రాంచైజీ సీజన్‌లో మొదటి హోమ్ మ్యాచ్‌కు ముందు నాలుగు రోజుల్లో ప్రధాన స్క్వేర్‌లో ఎటువంటి ప్రాక్టీస్ సెషన్‌లు లేదా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకూడదు. రెండు జ‌ట్లు ఒకేసారి ప్రాక్టీస్ చేయాల‌నుకుంటే సెష‌న్ల వారీగా అవ‌కాశం ఇస్తారు. ఈ మేర‌కు కొత్త నిబంధనలను బీసీసీఐ నోట్ ద్వారా ఐపీఎల్ జట్లకు తెలియజేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *