IND vs AUS 1st Semis: టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా.. సేమ్ టీమ్‌తో భారత్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న మ్యాచులో భారత్(India) టాస్ ఓడింది. దుబాయ్(Dubai) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 14వ సారి టాస్ ఓడిపోయి చరిత్రకెక్కాడు. ఇక ఈ మ్యాచులో భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. అటు ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు చేసింది. షార్ట్, జాన్సన్ స్థానాలలో కూపర్, సంఘ జట్టులోకి వచ్చారు. కాగా ఈ మ్యాచులో గెలిచి ప్రపంచకప్(WC 2023), వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌(WTC)లలో ఆస్ట్రేలియాతో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఈసారి ఛాంపియన్స్‌ ట్రోఫీలో సెమీఫైనల్‌ మ్యాచ్‌లకూ ఐసీసీ రిజర్వ్ డే(Reserve Day) కేటాయించడం గమనార్హం.

తుది జట్లు..

భారత్: రోహిత్ శర్మ(C), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్(WK), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

ఆస్ట్రేలియా: కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (C), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (w), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *