టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin).. పరిచయం అక్కర్లేని పేరు ఇది. తీసింది మూడే సినిమాలు. కానీ ఒక్కో సినిమా ఒక్కో డైమండ్. నాగ్ అశ్విన్ టాలీవుడ్ లో పదేళ్ల పాటు జర్నీ చేశాడు. ఈ ప్రయాణంలో చేసింది మూడే సినిమాలయినా.. ఒక్కో సినిమా వందేళ్లపాటు గుర్తంచుకునే ఇంపాక్ట్ వదిలింది. అందులో మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం (Yevade Subramanyam). ఈ చిత్రం 2015లో విడుదలైంది. నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ, మాళవిక ప్రధాన పాత్రల్లో నటించారు.
Celebrating 10 incredible years of @nagashwin7 in cinema ❤️📽️
Here’s to bringing dreams to life, pushing boundaries, and creating magic for years to come! pic.twitter.com/YhbrkVev8d
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) March 21, 2025
గెలుపంటే ఇదేరా
ఈ చిత్రం వచ్చి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రయాణాన్ని గుర్తుచేస్తూ.. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) ప్రత్యేక వీడియో రిలీజ్ చేసింది. అందరూ డాక్టర్లే ఉన్న కుటుంబంలో నుంచి అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని చెప్పే నాగ్ అశ్విన్.. సినిమా కోసమే పుట్టాడేమో అనిపించేటు వంటి సినిమాలను చిత్రపరిశ్రమకు అందించాడు. రెండో సినిమా మహానటి (Mahanati)తో దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించాడు. సావిత్రి గురించి ఇంత గొప్పగా ఇంకా ఎవరూ చెప్పలేరేమో అన్నంత అద్భుతంగా ఆ సినిమా తీశాడు.
మూడు ఆణిముత్యాలు
ఇక మూడో సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో ‘కల్కి 2898 ఏడీ (Kalki 2898AD)’ మూవీ తెరకెక్కించాడు. మరో ప్రపంచాన్ని సృష్టించి అద్భుతమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ప్రస్తుతం కల్కి-2 పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ దర్శకుడు తెరకెక్కించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ఇవాళ థియేటర్లలో రీ రిలీజ్ అయింది. మొదటి సారి విడుదలైనప్పటి కంటే రీ రిలీజ్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు మూడు ఆణిముత్యాలను అందించిన నాగ్ అశ్విన్ మరెన్నో అద్భుతమైన చిత్రాలు చేయాలని కోరుకుంటూ టాలీవుడ్ లో పదేళ్లు పూర్తి చేసుకున్న ఆయనకు నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.






