Gaddar Awards 2025: గద్దర్ అవార్డ్స్.. జయసుధకు కీలక బాధ్యతలు

అలనాటి సీనియర్ నటి జయసుధకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(FDC) కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ(Gaddar Telangana Film Awards Jury Committee) ఛైర్‌పర్సన్‌గా జయసుధ(Jayasudha) ఎంపిక చేసింది. మొత్తం పదిహేను మంది సభ్యులతో కూడిన జ్యూరీ కమిటీని FDC ఏర్పాటు చేసింది. జయసుధ, FDC MD హరీశ్‌లతో ఎఫ్‌డీసీ ఛైర్మన్, ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు(Chairman Dil Raju) ఈ మేరకు బుధవారం రాత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడారు.

Govt constitutes committee for Gaddar Awards

ఎంపిక ప్రక్రియను సజావుగా సాగాలి

నామినేషన్ల(Nominations)ను నిష్పక్షపాతంగా పరిశీలించాలని సూచించారు. ఎంపిక ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డుల(Film Awards)కు ఇంతటి స్పందన రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. గద్దర్ అవార్డుల(Gaddar Awards) కోసం దాఖలైన కాగా నామినేషన్లను ఈ నెల 21వ తేదీ నుంచి జ్యూరీ(Jury) పరిశీలించనుంది. తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో కలిపి 1,248 నామినేషన్లు రాగా, వ్యక్తిగత కేటగిరీలో 1,172, ఫీచర్ ఫిల్మ్, చిల్ట్రన్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీలలో 76 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *