అక్షయ తృతీయ వేళ.. మళ్లీ పెరిగిన బంగారం ధర

ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ. ఈ శుభముహూర్తాన బంగారం కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. అందుకే ఆరోజు తప్పకుండా పిసిరింతైనా పసిడి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం అక్షయ తృతీయకు సామాన్యులు బంగారం కొనుగోలు చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే పుత్తడి రేట్లు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. గోల్డ్ ధరలు లక్ష రూపాయల వరకు చేరాయి. అయితే రెండ్రోజుల నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

పెరిగిన గోల్డ్ రేట్లు

అయితే తాజాగా మాత్రం బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా మంగళవారం రోజున గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ లో సోమవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ తులం ధర రూ.97,530 ఉండగా.. మంగళవారం నాటికి రూ.440 పెరిగి రూ.97970 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సోమవారం నాడు రూ.89400 ఉండగా మంగళవారం నాటికి రూ.400 పెరిగి రూ.89,800 వద్ద పలుకుతోంది. మరోవైపు సోమవారం కిలో వెండి ధర రూ.99,600 ఉండగా, మంగళవారం నాటికి రూ.207 తగ్గి రూ.99,393కు చేరుకుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *