Operation Sindoor: పాకిస్థాన్ కుటిలబుద్ధిని ఎండగట్టిన భారత్

ఆపరేషన్‌ సిందూర్‌లో (Operation Sindoor) భాగంగా పాకిస్థాన్‌(Pakistan)లోని ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, సైనిక స్థావరాలు కాదని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలకు తొలుత పాకిస్థాన్‌ తెరలేపిందని పేర్కొంది. ఏప్రిల్‌ 22న పహల్గాం(Pahalgam)లో పాక్‌ ఉగ్రమూకల దాడితో ఇది మొదలైందని తెలిపింది. అంతర్జాతీయ సమాజానికి దాయాది దేశం తప్పుడు సమాచారం అందిస్తోందని పేర్కొంది. ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)కు సంబంధించి కల్నల్‌ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi), వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌(Vyomika Singh)లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ(Vikram Misri) ఈ వివరాలు వెల్లడించారు.

పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని దెబ్బతీశాం..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’’ ద్వారా దాయాది దేశంలోని ఉగ్రస్థావరాల(Terrorist camps)ను ధ్వంసం చేసింది. అయితే, పాకిస్థాన్ మాత్రం భారత నగరాలపై బుధవారం రాత్రి సమయంలో క్షిపణి దాడుల(Missile attacks)కు ప్రయత్నించిందని, భారత్ గగనతల రక్షణ వ్యవస్థ వాటిని తిప్పికొట్టినట్లు అధికారులు చెప్పారు. దీనికి ప్రతిగా భారత్ పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌(Air Defense Systems)ని దెబ్బతీసినట్లు వెల్లడించారు.

ఉగ్రవాదులకు ప్రభుత్వం అంత్యక్రియలు..

అంతేకాదు ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని ప్రపంచం ముందుంచారు. ఉగ్రవాదులకు ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించడం పాకిస్థాన్‌లో ఒక ఆచారంగా మారిందని విమర్శించారు. హతమైన ఉగ్రవాదుల శవపేటికల ముందు యూనిఫాం ధరించి ఉన్న పాక్ సైన్యం, పోలీసులు ఉన్న ఫోటోలను అంతర్జాతీయ సమాజం ముందుంచారు. శవయాత్రలో ఆర్మీ అధికారులు పాల్గొన్న విషయాన్ని చెప్పారు.

Related Posts

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *