Hyderabad Metro: రేపటి నుంచి మెట్రో ఛార్జీలు తగ్గింపు

హైదరాబాద్‌ మెట్రో (Hyderabad Metro) ఛార్జీలు పెంచడంతో వచ్చిన విమర్శలతో ఎల్ అంటీ టీ సంస్థ కాస్త వెనక్కి తగ్గింది. ఛార్జీలను తగ్గిస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఈ తగ్గించిన ఛార్జీలు శనివారం నుంచి అమలు కానున్నాయి. ఇందుకు సంబంధించి వివరాలను సంస్థ రిలీజ్ చేసింది. రెండు కి.మీ వరకు మెట్రో ఛార్జీని రూ.12 నుంచి రూ.11కు తగ్గించారు. 2 నుంచి 3 కి.మీ వరకు రూ.18 నుంచి రూ.17కి సవరించారు. 4 నుంచి 6 కి.మీ వరకు రూ.30 నుంచి రూ.28కి, 6 నుంచి 9 కి.మీ వరకు మెట్రో ఛార్జీని రూ.40 నుంచి రూ.37కి తగ్గించారు. మే 15న మెట్రో ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే..

తగ్గించిన ఛార్జీల వివరాలు ఇలా..

* 9 నుంచి 12 కి.మీ వరకు మెట్రో ఛార్జీలు రూ.50 నుంచి రూ.47కి తగ్గింపు

* 12 నుంచి 15 కి.మీ వరకు రూ.55 నుంచి రూ.51కి తగ్గింపు

* 15 నుంచి 18 కి.మీ వరకు రూ.60 నుంచి రూ.56కి తగ్గింపు

* 18 నుంచి 21 కి.మీ వరకు రూ.66 నుంచి రూ.61కి తగ్గింపు

* 21 నుంచి 24 కి.మీ వరకు రూ.70 నుంచి రూ.65కి తగ్గింపు

* 24 కిలోమీటర్లకు పైగా రూ.75 నుంచి రూ.69కి తగ్గింపు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *