తెలంగాణ(Telangana) మాజీ సీఎం, BRS పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం తీవ్ర అనారోగ్యానికి(Illness) గురైన సంగతి తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రి(Somajiguda Yashoda Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రి వైద్యుల బృందం హెల్త్ బులిటెన్(Health Bulliten) విడుదల చేసింది. తీవ్ర జ్వరం(high fever)తో కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు షుగర్ లెవెల్స్(Sugar Levels) అధికంగా పెరిగినట్టు తేలిందన్నారు. అలాగే సోడియం లెవెల్స్ కూడా భారీగా పడిపోయాయని పేర్కొన్నారు.
Yashoda Hospitals releases Health Bulletin of Ex Cm #KCR#Kcr is suffering with High blood sugar levels and low sodium levels.
Other than this everything is in normal condition.#GetWellSoonKcr#Kcr#Brs pic.twitter.com/GCLl1uzAuJ
— SHRA.1 ✍ (@shravanreporter) July 3, 2025
కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా
మిగిలిన అన్ని టెస్టులు నార్మల్ గానే వచ్చాయని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే(Health is stable) ఉందని తెలిపిన వైద్యులు.. క్లోజ్ అబ్జర్వేషన్(Close observation)లో ఉంచి, చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో 2023 డిసెంబర్లో KCR తుంటి ఎముక ఫ్రాక్చర్ కారణంగా యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలో ఆయన వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుని కోలుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ చెకప్స్ కోసం ఆసుపత్రికి వెళ్తున్నారు. తాజాగా ఆయన ఆసుపత్రిలో చేరడంతో BRS శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. కాగా కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాసేపటి క్రితమే ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.






