Shiva Shakti Datta: టాలీవుడ్‌లో విషాదం.. ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తిదత్తా కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) తండ్రి, ప్రసిద్ధ సినీ గేయ రచయిత శివ శక్తి దత్తా (Shiva Shakti Datta) కన్నుమూశారు. 93 ఏళ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కీరవాణి కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కాగా శివ శక్తి దత్తా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గేయ రచయిత, దర్శకుడి(Director)గా తనదైన ముద్ర వేశారు. ఆయన రాసిన పాటలు(Songs) సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన సినీ రంగంలో చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. ఆయన మరణవార్త తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు నింపింది.

కమలేశ్‌ అనే కలం పేరుతో..

శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు(Koduri Subbarao). 1932 అక్టోబరు 8న రాజమండ్రి సమీపంలోని కొవ్వూరు(Kovvuru)లో జన్మించారు. చిన్న తనంలోనే కళలపై ఆసక్తి ఉన్న ఆయన.. ఇంటి నుంచి వెళ్లిపోయి ముంబైలోని ఓ ఆర్ట్స్‌ కాలేజీలో చేరారు. రెండేళ్ల తర్వాత కొవ్వూరుకు తిరిగొచ్చి కమలేశ్‌(Kamalesh) అనే కలం పేరుతో చిత్రకారుడిగా పనిచేశారు. ఆ తర్వాత సంగీతంపై ఇష్టంతో గిటార్‌, సితార, హార్మోనియం నేర్చుకున్నారు.

సంగీత దర్శకుడు 'కీరవాణి' ఇంట్లో విషాదం | Keeravani Father Sivadatta Passed AWAY | Sakshi

సినీ ప్రముఖులు, అభిమానుల సంతాపం

శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం. కీరవాణి, కల్యాణి మాలిక్‌, శివశ్రీ కంచి. ఆయనకు ఒక అన్న, అక్క, నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. శివశక్తి దత్తా సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలి, బాహుబలి 2, RRR, హనుమాన్ వంటి పలు సినిమాలకు పాటలు రచించారు. కాగా ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *