Siddhu Jonnalagadda: సిద్ధూ కొత్త మూవీ ప్రకటన.. టైటిల్ అదిరిపోయిందిగా!

భిన్నమైన స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక చాటుకున్న యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda). వరుస మూవీలతో దూసుకుపోతున్న సిద్ధూ.. మరో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణసంస్థ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను పంచుకుంది. ఈ మూవీకి ‘బడాస్‌’ (Badass) పేరు ఖరారు చేసినట్లు తెలిపింది. వచ్చే రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది.

హీరోలను, విలన్‌లను చూసి ఉంటారు.. కానీ

మాస్ ఆడియన్స్ను దృష్టిలో ఉంచుకొని ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధుతో ‘కృష్ణ హిస్ లీల’ తీసిన రవికాంత్‌ పేరెపు దర్శకత్వం వహిస్తున్నారు. నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) సిద్ధు పోస్టర్ను రిలీజ్ చేసింది. ‘‘మీరు ఇప్పటివరకూ హీరోలను, విలన్‌లను చూసి ఉంటారు. కానీ, ఇప్పుడు వారికి మించి చూస్తారు. ఈసారి కనికరం లేకుండా ఫైర్‌ సెట్‌ చేస్తాడు’’ అని పేర్కొంది. మూవీ హీరోయిన్, ఇతర క్యారెక్టర్లు, చిత్ర యూనిట్ను త్వరలోనే పంచుకునే అవకాశం ఉంది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ‘తెలుసు కదా’!

డీజే టిల్లు సిరీస్తో మంచి పేరుతెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. అయితే‘జాక్‌’ ఫ్లాప్ కావడంతో ఈ సారి మంచి హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీరజ్ కోన డైరెక్టర్గా పరిచయమవుతున్న ప్రస్తుతం ‘తెలుసు కదా’ (Telusu Kada) సినిమాలో నటిస్తున్నాడు సిద్ధూ. రాశీ ఖన్నా (Raashii Khanna), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్లు. ట్రయాంగిల్ లవ్స్టోరీగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా షూటింగ్ తర్వాత సిద్ధూ ‘బడాస్’ మూవీతో బిజీ కానున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *