తెలుగు సినీ ప్రియులకు శుభవార్త. బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohith) ప్రధాన పాత్రల్లో నటించిన హై-ఓక్టేన్ యాక్షన్ డ్రామా ‘భైరవం(Bhairavam)’ గురువారం అర్ధరాత్రి (జులై 18) నుంచి ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రం ZEE5 ప్లాట్ఫామ్లో తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మే 30, 2025న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందనతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భైరవం’ తమిళ హిట్ చిత్రం ‘గరుడన్(Garudan)’ మూవీకి రీమేక్గా వచ్చింది.

ముగ్గురు స్నేహితుల స్నేహానికి పరీక్ష
ఈ స్టోరీ తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపురం గ్రామంలోని వారాహి ఆలయ భూముల చుట్టూ తిరుగుతుంది. గజపతి (Manchu Manoj), వరద (Nara Rohith), శ్రీను (Bellamkonda Sai Srinivas) అనే ముగ్గురు స్నేహితుల బంధం, విశ్వాసం, త్యాగాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఒక అవినీతి మంత్రి ఆలయ భూముల(Temple Lands)ను కైవసం చేసుకోవాలని పథకం వేయడంతో ఈ ముగ్గురి స్నేహం పరీక్షకు గురవుతుంది. అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై, జయసుధ(Jayasudha) తదితరులు కీలక పాత్రల్లో నటించారు.






