Acia Cup-2025: ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే

క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు మరో మెగా టోర్నీ రాబోతుంది. ఆసియా కప్ (Acia Cup-2025) ఈ ఏడాది 17వ ఎడిషన్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరగనుంది. T20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ 2026 T20 వరల్డ్ కప్‌కు సన్నాహకంగా కానుంది. ఈ టోర్నీలో ఆసియా నుంచి ఎనిమిది జట్లు పాల్గొంటాయి. అందులో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్, UAE, ఒమన్ జట్లు పాల్గొంటాయి. భారత్(India) డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంద. 2023లో శ్రీలంకను ఓడించిన భారత్ టైటిల్ గెలిచింది.

Image

రెండు గ్రూప్‌లు.. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు

కాగా టోర్నమెంట్ రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి. గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, UAE, ఒమన్ ఉండగా, గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్ ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్ రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకుంటాయి. సూపర్ ఫోర్‌లో రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఆడిన తర్వాత, టాప్ రెండు జట్లు సెప్టెంబర్ 28న ఫైనల్‌లో తలపడతాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో అత్యంత ఆసక్తికరమైన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్(India vs Pakistan Match) సెప్టెంబర్ 7న గ్రూప్ దశలో జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌ను భారత్ హోస్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ, భారత్-పాకిస్థాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా UAEలో నిర్వహిస్తున్నారు. టికెట్‌లు ఆన్‌లైన్‌లో Paytm, BookMyShow వంటి ప్లాట్‌ఫారమ్‌లతోపాటు ఆఫ్‌లైన్ రిటైల్ ఔట్‌లెట్‌లలోనూ అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Image

భారత్ షెడ్యూల్ ఇలా..

☛ సెప్టెంబర్ 10: ఇండియా vs యూఏఈ
☛ సెప్టెంబర్ 14: ఇండియా vs పాకిస్థాన్
☛ సెప్టెంబర్ 19: ఇండియా vs ఒమన్

సూపర్ ఫోర్ మ్యాచులు ఇలా..

☛ సెప్టెంబర్ 20: B1 vs B2
☛ సెప్టెంబర్ 21: A1 vs A2 (అంచనా: ఇండియా vs పాకిస్థాన్)
☛ సెప్టెంబర్ 23: A2 svs B1
☛ సెప్టెంబర్ 24: A1 vs B2
☛ సెప్టెంబర్ 25: A2 vs B2
☛ సెప్టెంబర్ 26: A1 vs B1

☛ సెప్టెంబర్ 28: ఫైనల్

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *