Election Commission: బిహార్‌లో 65 లక్షల ఓటర్ల తొలగింపు.. ప్రతిపక్షాలు ఫైర్

బిహార్‌(Bihar)లో 65.2 లక్షల ఓటర్ల పేర్లు జాబితా(Voter names list) నుంచి తొలగించామని ఎన్నికల కమిషన్‌(Election Commission) ప్రకటించడం ఆ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. నెల రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ తర్వాత, ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 7.8 కోట్ల ఓటర్లలో 7.2 కోట్ల మంది తమ ఎన్యూమరేషన్‌ పత్రాల(Enumeration documents)ను సమర్పించగా, 91.6 శాతం పత్రాలు స్వీకరించినట్లు కమిషన్‌ తెలిపింది. అయితే, 65.2 లక్షల మంది ఓటు హక్కు(right to vote)ను తొలగించారు. ఇందులో 22 లక్షల మంది మరణించినవారు కాగా, 26 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లినవారని, మరో 7 లక్షల మంది రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నవారని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.

बिहार में 64 लाख वोटर्स का कट जाएगा नाम, चुनाव आयोग के SIR से क्या-क्या आया  सामने? | Bihar voter list Special Summary Revision ECI electoral rolls Bihar  election data

అర్హులైన ఓటర్లకు నెల రోజుల గడువు

ఈ ప్రక్రియపై ప్రతిపక్షాలు(Opposition parties) తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు ప్రత్యేక పథకం అమలైందని ఆరోపించాయి. అయితే, ఎన్నికల కమిషన్‌ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. వలస కార్మికులను జాబితా నుంచి తొలగించబోమని, 16 లక్షల మంది వలస కార్మికులు(Migrant workers) ఆన్‌లైన్‌లో పత్రాలు సమర్పించినట్లు స్పష్టం చేసింది. అర్హులైన ఓటర్లకు నెల రోజుల గడువు ఇచ్చామని, ఆందోళన అవసరం లేదని కమిషన్‌ పేర్కొంది. రాజకీయ పార్టీలు బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించాయని, CPI(M), కాంగ్రెస్‌లు వంద శాతానికి పైగా ఏజెంట్లను పెంచాయని తెలిపింది. ఈ వివాదం బిహార్‌ రాజకీయాల్లో కీలక చర్చనీయాంశంగా మారింది.

Final electoral rolls for 2023 updated, here's how to check your name on it  | India News - The Indian Express

అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 1లోగా తెలపండి

కాగా ముసాయిదా జాబితా(Draft list)ను ఈసీ తాజాగా విడుదల చేసింది. దీనిని ప్రధాన రాజకీయ పార్టీలకు అందజేసింది. తాజాగా ఓటర్లకు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 1లోగా ECకి తెలియజేయవచ్చు. ఆ తర్వాత ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రచురిస్తుంది. ఈసీ చేపట్టిన SIRను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌, ఆర్జేడీ వంటి విపక్ష పార్టీలు ఈ ముసాయిదాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *