Mana Enadu: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఇండస్ట్రీలో అందరినీ కలుపుకొని పోయే గుణం. నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని ఏలుతూనే ఉన్నారు మెగాస్టార్. జీవితంలో జయాపజయాలు కామన్. అందుకే విజయం వస్తే ఉప్పొంగిపోవడం, అపజయం వస్తే కుంగిపోవడం ఆయనకు తెలీదు. అయితే కష్టపడితేనే విజయం వరిస్తుందని నమ్మిన వ్యక్తి చిరు. ఎప్పుడూ తన సినిమాతో అభిమానులను అలరించేందుకు తాపత్రయపడుతూనే ఉంటారు. నటుడిగా విశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న ఈ మెగా హీరో.. వ్యక్తిగాను ‘అందరివాడు’ అయ్యారు. సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. బ్లడ్ బ్యాంక్తో పాటు ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ల ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి ఎంతో సాయం చేశారు. ఇంకా సేవను కొనసాగిస్తూనే ఉన్నారు.
తాజాగా చిరంజీవి తన అభిమాని పట్ల ప్రేమాగుణం చాటుకున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 22న ఈశ్వరయ్య అనే అభిమాని తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఈ విషయం కాస్తా చిరంజీవి చెవిలో పడటంతో అదే రోజు ఈశ్వరయ్యని తిరుమలలో కలిశారు. అంతేకాదు ఓ సారి తనను హైదరాబాద్లోని తన ఇంటికి వచ్చి కలవాలని కోరారు. అన్నట్లుగానే ఈశ్వరయ్యను, ఆయన కుటుంబ సభ్యులను హైదరాబాద్లోని తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు మెగాస్టార్. వారి కుటుంబానికి పట్టు బట్టలు పెట్టి సత్కరించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటానని ఈ మెగా హీరో హామీ ఇచ్చారు.
అయ్యప్పమాల ధరించిన చిరంజీవి
కాగా గతంలోనూ ఈశ్వరయ్య తిరుపతి నుంచి చిరంజీవి ఇంటి వరకు సైకిల్ యాత్రను నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజుతో పాటు ఆ పార్టీ ఎన్నికల్లో గెలవాలని కూడా అనేక సార్లు ఆయన పొర్లు దండాలు పెట్టారు.ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి సోమవారం అయ్యప్ప మాలను ధరించారు.






