మాలీవుడ్ లో హేమ కమిటీ రిపోర్టు రచ్చ.. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు రాజీనామా చేయాలన్న హీరో పృథ్వీరాజ్‌

ManaEnadu:మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో సంచలనం రేకెత్తిస్తోంది. ఈ రిపోర్టులోని వివరాలు బయటకు వచ్చిన తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ తమకు ఎదురైన అనుభవనాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రిపోర్టుపై, రిపోర్టు తర్వాత జరుగుతున్న పరిణామాలపై తాజాగా మలయాళీ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ స్పందించాడు.

కొచ్చిలో ఫుట్‌బాల్ క్లబ్ ‘ఫోర్కా కొచ్చి’ (ఎఫ్‌సి) ప్రారంభోత్సవంలో పాల్గొన్న పృథ్వీ రాజ్ సుకుమారన్.. విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. అధికారంలో ఉండి ఆరోపణలు ఎదర్కొంటున్న వారు వెంటనే పదవుల నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. నిందితులు దోషులని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

“హేమ కమిటీలో వెల్లడించిన అంశాలు నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే పరిశ్రమలో మహిళలకు సురక్షిత పని వాతావరణం కల్పించడం మన కనీస బాధ్యత. అందులో నేను ముందుంటా. కానీ అది నా ఒక్కడి బాధ్యత మాత్రమే కాదు. పరిశ్రమ మొత్తం ఆ పద్ధతిని అనుసరించాలి. అంతేకాదు జూనియర్‌ ఆర్టిస్టుల ఎంపికను క్రమబద్ధీకరించాలి’’ అని పృథ్వీరాజ్ తెలిపారు.

Related Posts

Saiyaara: ‘ఆషికీ 2’ తర్వాత మళ్లీ ఇంటెన్స్ లవ్ స్టోరీ ‘సయారా’ ట్రైలర్ వైరల్..

బాలీవుడ్‌లో ప్రేమకథలు కొత్తేమీ కాదు. కానీ ప్రతి తరం ప్రేక్షకుడిని టచ్ చేసేలా కొన్ని కథలు మనసులో మిగిలిపోతాయి. ఇక అర్థాంతరంగా ముగిసిన ప్రేమకథలకూ బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ లభించింది. అలాంటి క్రమంలోనే దర్శకుడు మోహిత్ సూరి(Mohith Suri), ప్రముఖ…

OTT: ఓటీటీలో సందడి చేయనున్న కుబేర.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్​ కమ్ముల(Shekar Kommala) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటించిన తాజా చిత్రం ‘కుబేర’(Kubera). ఈ చిత్రం జూన్ 20న విడుదలై ఊహించని రీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *