Actor Sriram: డ్రగ్స్​ కేసులో శ్రీరామ్‌కు 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ

నటుడు శ్రీరామ్‌ (Actor Sriram)కు కోర్టు జ్యుడీషియల్​ కస్టడీ విధించింది. డ్రగ్స్‌ కేసులో నటుడు శ్రీకాంత్‌ (Srikanth) అలియాస్‌ శ్రీరామ్‌ (Sriram)ను చెన్నై పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు 8 గంటల సుదీర్ఘ విచారణ జరిపారు. అనంతరం చెన్నై కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం అతడికి జులై 7వ తేదీ వరకు (14 రోజులు) జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌లో ప్రమేయం శ్రీరామ్​కు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు గుర్తించి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.

డ్రగ్స్​ వాడినట్లు నిర్ధారణ

ఏఐడీఎంకే (AIADMK) మాజీ నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో అతడిని అరెస్ట్​ చేశారు. చెన్నైలోని ఓ బార్‌లో గత నెల జరిగిన గొడవకు సంబంధించి అన్నాడీఎంకే నాయకులు ప్రసాద్, అజయ్‌ వాండైయార్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్​ చేసి విచారించారు. వీరు మత్తు పదార్థాలు వాడినట్లు ఫిర్యాదులు రావడంతో ఎవరి నుంచి కొనుగోలు చేశారని, ఎవరెవరికి సరఫరా చేశారని పోలీసులు ఆరా తీశారు. దీంతో శ్రీరాం డ్రగ్స్​ సరఫరా చేసినట్లు తెలిసింది. ఓ వ్యక్తి నుంచి కొకైన్‌ కొనుగోలు చేశారని, దానికి సంబంధించి నగదును ఆన్‌లైన్‌లో చెల్లించారని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో నుంగంబాక్కం పోలీసులు సోమవారం శ్రీకాంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించగా.. డ్రగ్స్​ వాడినట్లు నిర్ధరణ అయ్యింది. దాంతో నటుడిని అరెస్ట్​ చేశారు.

తిరుపతి నుంచి చెన్నైకి వెళ్లి..

ఆంధ్రప్రదేశలోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాల్లో అవకాశాల కోసం చిన్న వయసులోనే చెన్నైకి వెళ్లారు. అక్కడ తన పేరును శ్రీరామ్‌ (Sriram)గా మార్చుకుని, తొలుత చిన్న పాత్రలు పోషించారు. ‘రోజా పూలు(Roja poolu)’ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా నటించి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పలు సపోర్టింగ్​ రోల్స్​లో కనిపించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *