ఖోఖో ప్రపంచ కప్ 2025.. బ్రాండ్ అంబాసిడ‌ర్ గా టైగర్ ష్రాఫ్

Mana Enadu : బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) గురించి తెలిసిన వారికి.. ఆయనకు ఫిట్ నెస్ పై ఉన్న మక్కువ గురించి కూడా తెలిసే ఉంటుంది. ప్రజెంట్ బీ టౌన్ లో ఫిట్టెస్ట్ హీరోల్లో టైగర్ ష్రాఫ్ కూడా ఒకడు. తాజాగా ఆయన ఫిట్ నెస్ కు తగ్గట్టు ఓ పదవీ వరించింది. ఖోఖో ప్రపంచ కప్ 2025 (Kho Kho World Cup 2025)కి కో బ్రాండ్ అంబాసిడర్ గా టైగర్ ష్రాఫ్ ను ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్‌ఐ) నియమించింది. జనవరి 13వ తేదీ నుంచి దిల్లీలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక టోర్నమెంట్ భారతదేశ ప్రతిష్టాత్మకమైన క్రీడపై ప్రపంచ క్రీడా ప్రేమికులకు అవగాహన కల్పిస్తుందని అసోసియేషన్ తన ప్రకటనలో పేర్కొంది.

Image

ఫిట్ నెస్ పొందడానికి క్రీడలు గొప్ప మార్గం

ఇక ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన టైగర్ ష్రాఫ్ (Tiger Shroff Kho Kho Brand) ఖోఖో బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియామకం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.  యువ‌త‌ ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో క్రీడల పాత్రను టైగ‌ర్ తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫిట్ నెస్ అనేది భాగం కావాలని చెప్పారు. ఫిట్ నెస్ పొందడానికి క్రీడలు గొప్ప మార్గం అని పేర్కొన్నారు. ఖోఖో అనేది ఫిట్‌నెస్.. స్ట్రాటజీ .. స్పిరిట్‌ల సంపూర్ణ సమ్మేళనం అని వివరించారు. ఖోఖో భారతీయ క్రీడ అని.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కాలని ఆశించారు. గొప్ప క్రీడను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు కేకేఎఫ్ఐకి ధన్యవాదాలు తెలిపారు.

Image

24 దేశాలు.. 21 పురుషులు.. 20 మహిళల జట్లు

24 దేశాల నుంచి 21 పురుషులు.. 20 మహిళల జట్లతో వారం రోజుల పాటు  ఖో-ఖో ప్రపంచ కప్ పోటీలు జరగనున్నాయి. ఐకానిక్ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం (Indira Gandhi Indore Stadium)లో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉన్నందున ఖో-ఖో ప్రపంచ కప్ ఒక ప్ర‌త్యేక‌ ఈవెంట్‌గా ర‌క్తి క‌ట్టిస్తుందని, ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షిస్తుంద‌ని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక ఖోఖో ప్రపంచ కప్‌నకు అనన్య పాండే (Ananya Pandey), సారా అలీ ఖాన్ , అభినవ్ బింద్రా త‌దిత‌రులు ప్ర‌చార సాయం అందిస్తున్నారు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *