Vishal: థియేటర్ల వద్ద పబ్లిక్ రివ్యూలు.. నటుడు విశాల్ ఏమన్నారంటే?

తమిళ నటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్(Actor Vishal) సినిమా రివ్యూ(Reviews)లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదలైన మొదటి మూడు రోజుల పాటు థియేటర్ల వద్ద ప్రేక్షకుల సమీక్షల(Public Reviews)ను రికార్డు చేయడం నిషేధించాలని ఆయన కోరారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో, ముఖ్యంగా యూట్యూబర్లు(YouTubers), మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాను నటించిన ‘రెడ్ ఫ్లవర్(Red Flower)’ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో విశాల్ ఈ కామెంట్స్ చేశారు.

Is actor Vishal's health in good condition? Here is why this question  arises - Telangana Today

కనీసం 12 షోలు పూర్తయ్యే వరకు

విశాల్ మాట్లాడుతూ, సినిమా రిలీజైన వెంటనే థియేటర్ల వద్ద పబ్లిక్ రియాక్షన్లు తీసుకోవడం వల్ల కొత్త చిత్రాలకు ఆదరణ తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రివ్యూలు సినిమాకు సరైన అవకాశం ఇవ్వకుండా, ప్రతికూల అభిప్రాయాలతో దెబ్బతీస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కనీసం 12 షోలు పూర్తయ్యే వరకు ఇలాంటి సమీక్షలను నిలిపివేయాలని, దీనివల్ల సినిమా పరిశ్రమకు ఊపిరి పోసే అవకాశం ఉంటుందని సూచించారు.

సినీ పరిశ్రమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని

‘‘ప్రతి వారం విడుదలయ్యే అనేక సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సమయం అవసరం. అయితే, విడుదలైన వెంటనే ప్రతికూల రివ్యూలు వస్తే, సినిమా బతకడం కష్టమవుతుంది. సినీ పరిశ్రమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మీడియా, యూట్యూబర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని విశాల్ కోరారు. ఈ వ్యాఖ్యలు సినీ అభిమానులు, నిర్మాతల మధ్య మిశ్రమ స్పందనలను రేకెత్తించాయి. కొందరు విశాల్ అభిప్రాయాన్ని సమర్థిస్తూ, సినిమాకు సమయం ఇవ్వడం అవసరమని అంగీకరిస్తున్నారు. మరికొందరు మాత్రం, రివ్యూలు ప్రేక్షకుల అభిప్రాయ స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని వాదిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *