Air India: విమాన ప్రమాదం.. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల అదనపు సాయం

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా కూలిన ఘటన(Air India crash incident)లో ఫ్లైట్‌లోని 241 మందితోపాటు అది కూలిన భవనంలోని మెడికోలు 33 సహా మొత్తం 274 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎయిర్ ఇండియా బాసటగా నిలిచింది. ఈ మేరకు మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు మధ్యంతర చెల్లింపుగా అందించనున్నట్లు తాజాగా వెల్లడించింది. అలాగే ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడి (Passengers)కి కూడా తక్షణ ఆర్థిక అవసరాల నిమిత్తం ఈ మేరకు రూ.25 లక్షలు అందించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా తమ అధికారిక ఎక్స్(X)లో ప్రకటన విడుదల చేసింది.

రూ. కోటి సహాయానికి ఇది అదనం: ఎయిర్ ఇండియా

టాటా సన్స్(Tata Son’s) ఇప్పటికే ప్రకటించిన రూ. కోటి సహాయానికి ఇది అదనమని ఎయిర్ ఇండియా(Air India) స్పష్టం చేసింది. “ఇటీవల జరిగిన ప్రమాదంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా సంఘీభావం తెలుపుతోంది. ఈ అత్యంత క్లిష్ట సమయంలో క్షేత్రస్థాయిలో మా బృందాలు సాధ్యమైనంత వరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తున్నాయి” అని ప్రకటనలో పేర్కొంది.

London-bound Air India plane with 242 people on board crashes soon after  take-off | The Straits Times

కోలుకుంటున్న మృత్యుంజయుడు

కాగా గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు(Sardar Vallabhbhai Patel International Airport) నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం (AI171) కుప్పకూలింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉండగా, ఒక ప్రయాణికుడు మినహా మిగిలిన 241 మంది మరణించారు. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన రమేశ్ అనే ఏకైక ప్రయాణికుడి ఆరోగ్యం(Health) వేగంగా మెరుగుపడుతోందని సమాచారం.

Don't Know How I Got Saved": Air India Plane Crash Lone Survivor

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *