Akhil-Zainab Reception: గ్రాండ్‌గా అఖిల్-జైనాబ్ రిసెప్షన్

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) రెండో కుమారుడు, టాలీవుడ్ నటుడు అక్కినేని అఖిల్-జైనాబ్ రవడ్జీ(Akhil-Zainab Ravadji)ల పెళ్లి రిసెప్షన్(Reception) గ్రాండ్‌గా జరిగింది. ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడిస్‌(Annapurna Studies)లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు(Film & Political Celebrities) భారీగా తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Image

కాగా అఖిల్ తన ప్రియురాలు జైనాబ్ రవడ్జీ మెడలో ఈనెల 6న తెల్లవారుజామున 3 గంటలకు మూడుముళ్లు వేసి ఒక్కటయ్యారు. ఈ పెళ్లివేడుక జూబ్లిహిల్స్‌లోని నాగార్జున ఇంట్లో గ్రాండ్‌గా జరిగింది. ఇక నిన్న అఖిల్-జైనాబ్‌ల రిసెప్షన్ ఏర్పాటు చేసి సినీ, రాజకీయ ప్రముఖులకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు.

Image

అఖిల్-జైనాబ్‌ల రిసెప్షన్‌ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu), తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమట్ రెడ్డి, ఏపీ మంత్రి సత్యకుమార్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.

ఇక సినీ ప్రముఖులలో మహేశ్‌ బాబు-నమ్రత(Maheshbabu-Namrata), రామ్ చరణ్-ఉపాసన(Ram Charan-Upasana), విక్టరీ వెంకటేశ్, అల్లు అరవింద్, కిచ్చా సుదీప్, అడివి శేష్, నాని, నిఖిల్, కన్నడ నటుడు యశ్(Yash), తమిళ్ నటుడు సూర్య(Suriya), యంగ్ దర్శకులు సుకుమార్(Sukumar), బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ఈ రిసెప్షన్‌కు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించి శుభాకంక్షలు తెలిపారు.

Image

వీరితో పాటు మరికొంతమంది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఈ వివాహ విందులో పాల్గొని సందడి చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణం ప్రముఖుల రాకతో కళకళలాడింది.

Image

Image

Image

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *