బేబీ బంప్​తో టాలీవుడ్ హీరోయిన్ న్యూడ్ ఫొటో

ప్రతి మహిళ లైఫ్ లో తల్లి కావడం అనేది ఓ మధురానుభూతి. చాలా మంది మాతృత్వంతోనే తమ జీవితం పరిపూర్ణమైందని భావిస్తుంటారు. అలాంటి మదర్ హుడ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. తొమ్మిది నెలల పాటు పసికందును తమ కడుపులో మోస్తారు. ఆ క్రమంలో ప్రతి రోజును ఓ అనుభూతిలా ఫీలవుతుంటారు. అందుకే చాలా మంది ప్రెగ్నెన్సీ సమయంలో బేబీ బంప్ (Baby Bump)తో మ్యాటర్నెటీ ఫొటోషూట్ చేసుకుంటుంటారు.

హీరోయిన్ పోస్టుపై విమర్శలు

ఇప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో ఫొటోషూట్ (Maternity Photoshoot) ఓ ట్రెండ్ అయిపోయింది. ఇక సెలబ్రిటీలయితే ఈ ట్రెండ్ ను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి.. అర్ధనగ్నంగా.. రకరకాలుగా ఫొటోషూట్ లు చేస్తున్నారు. చాలాసార్లు వాటిపై నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అయిన సందర్భాలున్నాయి. తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది ఓ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరంటే..?

బేబీ బంప్ తో న్యూడ్ ఫొటో

నటి అమీ జాక్సన్ (Amy Jackson) రెండోసారి తల్లి కాబోతోంది. ఇటీవలే ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో బేబీ బంప్ ఫొటోలు పోస్టు చేసింది. స్విమ్మింగ్ పూల్ ముందు ఒంటిపై బట్టలు లేకుండా.. నగ్నంగా బేబీ బంప్ తో ఫొటో దిగింది. ఈ ఫొటోను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson Westwick (@iamamyjackson)

నెటిజన్లు ఫైర్

పవిత్రమైన మాతృత్వాన్ని ఇలాంటి వల్గర్ (Amy Jackson Baby Bump) ఫొటోషూట్లతో అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలా కాకుండా మామూలుగా కూడా ప్రెగ్నెన్సీ అనుభూతులు షేర్ చేసుకోవచ్చని విమర్శిస్తున్నారు. మొత్తానికి అమీ జాక్సన్ లేటెస్ట్ పోస్టు నెట్టింట ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎవడు సినిమాతో ఈ భామ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రోబో 2.0, ఐ, నవమన్మథుడు, పోలీసోడు సినిమాలతో అలరించింది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *