AP Agriculture Budget: రైతన్నకు పెద్దపీట.. వ్యవసాయరంగానికి రూ.రూ.43,402 కోట్లు

ManaEnadu: ఏపీ అసెంబ్లీ(Assembly Sessions) సెషన్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వ్యయసాయరంగానికి సంబంధించి ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Acchennaidu) వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి పద్దును అసెంబ్లీ ప్రవేశపెట్టారు. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.43,402 కోట్లతో అగ్రికల్చర్ బడ్జెట్‌(Agriculture Budget)ను ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. 62% జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని, గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం హయాంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి పెద్దపీట(Great for development) వేస్తున్నట్లు అచ్చెన్న తెలిపారు.

 ఆయా రంగాలకు కేటాయింపులు ఇలా..

☛ ఎరువుల సరఫరా రూ.40 కోట్లు.
☛ పొలం పిలుస్తోంది రూ.11.31కోట్లు.
☛ రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు
☛ అన్నదాత సుఖీభవ రూ.4,500 కోట్లు.
☛ భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు.
☛ విత్తనాల పంపిణీ రూ.240 కోట్లు.
☛ ప్రకృతి వ్యవసాయంకు రూ.422.96 కోట్లు.
☛ డిజిటల్ వ్యవసాయంకు రూ.44.77కోట్లు.
☛ వ్యవసాయ శాఖ రూ.8,564.37కోట్లు.
☛ ఉద్యానవన శాఖ రూ.3469.47 కోట్లు.
☛ పట్టు పరిశ్రమ రూ.108.4429 కోట్లు.
☛ వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు.
☛ సహకార శాఖ రూ.308.26 కోట్లు.
☛ వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు.
☛ వడ్డీ లేని రుణాలకు రూ.628కోట్లు.
☛ రైతు సేవా కేంద్రాలకు రూ.26.92కోట్లు.
☛ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 కోట్లు.
☛ పంటల బీమా పథకానికి రూ.1,023 కోట్లు.
☛ మత్స్య రంగం అభివృద్ధి కోసం రూ.521.34 కోట్లు.
☛ ఉచిత వ్యవసాయ విద్యుత్ రూ.7241.30 కోట్లు.
☛ ఉపాధి హమీ అనుసంధానం రూ.5,150 కోట్లు.
☛ NG రంగా విశ్వవిద్యాలయంకు రూ.507.038 కోట్లు.
☛ NTR జలసిరి రూ.50కోట్లు.
☛ నీరుపారుదల ప్రాజెక్టుల నిర్వహణ రూ.14,637.03 కోట్లు.
☛ ఉద్యాన విశ్వవిద్యాలయంకు రూ.102.227 కోట్లు.
☛ SV పశు విశ్వవిద్యాలయంకు రూ.171.72 కోట్లు.
☛ మత్స్య విశ్వవిద్యాలయం రూ.38కోట్లు.
☛ పశుసంవర్ధక శాఖ రూ.1,095.71 కోట్లు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *