Posani: జగన్​పై ఈనాడు, ఆంధ్రజ్యోతి రాతలపై పోసాని ఫైర్​

 

Mana Enadu: ఆంధ్రప్రదేశ్​ జరుగుతున్న ఎన్నికల్లో వైసిపి సర్కారుపై ఈనాడు, ఆంధ్రజ్యోతి అసత్యాలు రాస్తున్నాయని సీనినటుడు పోసాని కృష్ణ మురళి ఫైర్​ అయ్యారు. వైసిపి ప్రభుత్వంపై ప్రజలకు వందశాతం నమ్మకం ఉందన్నారు. హైదరాబాద్​లో శనివారం పోసాని ప్రెస్​మీట్​లో పవన్​ పై సంచలన కామెంట్స్​ చేశారు.

టైటిల్​ యాక్ట్​పై కావాలనే ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతికలు ప్రజలకు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రామోజీరావు, రాధాకృష్ణలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో మోసగాళ్లును గెలిపించడానికి చేసే ప్రయత్నాలను చేసే కుట్రలు ఏవి అడ్డుకోలేవన్నారు

రైతుల భూముల హక్కులపై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కుట్రలు చేస్తుందనే భయభ్రాంతులకు గురి చేసి అధికారం చెలాయించాలని చేసే ఎత్తుగడలు పనిచేయవని స్పష్టం చేశారు. రైతులను భయబ్రాంతులకు గురిచేస్తూ అసత్య ప్రచారం చేయడం మంచిది కాదన్నారు.

ప్రజల కోసం పనిచేసే నాయకుడు జగన్​ మరోసారి అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఒక్కటై చేసే కుట్రలను ప్రజలు సరైన బుద్ది చెబుతారన్నారు. చంద్రబాబు, జగన్​ పరిపాలన మధ్య వ్యత్యాసాలను ప్రజలు గుర్తించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జగన్​ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఇప్పటికే జనం ఛీకొట్టారని మరోసారి ఛీకొడతారన్నారు.

కరోనా కాలం లో సహాయం చేయడానికి ముందుకు రాని బాలకృష్ణ, జయప్రకాష్​ నారాయణలకు జగన్​ని విమర్శలు చేసే అర్హత లేదన్నారు. జగన్ ఒక్కడే ప్రజలకు సువర్ణపాలన అందించే దమ్మున్న నాయకుడు అన్నారు. జగన్​ ఓటమి చెందింతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే పరిస్థితి ఉండదన్నారు.

జగన్ మీటింగ్​ పెడితే ప్రజలు ఎంతో నమ్మకంతో స్వచ్ఛందంగా వస్తున్నారన్నారు. నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడిగా సీఎం జగన్ అన్నారు. జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ గతంలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై నిలబడాలని సవాల్​ చేశారు

Share post:

లేటెస్ట్