Padma Vibhushan: పురస్కారం అందుకోవాడానికి వాళ్లే కారణం…ఆనందంగా ఉంది: మెగాస్టార్​

Mana Enadu: ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగా నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే అభిమానుల అండదండలు ఎప్పుడూ మరచిపోలేను. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల గురించి మాట్లాడాలంటే నేను ఏ పార్టీలో లేను. పిఠాపురంలో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నాను. పవన్‌‌కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి నేను వెళ్లటం లేదు. పవన్ నాకు ఆ కంఫర్ట్ ఇచ్చాడు. అలాగే పవన్ కూడా నన్ను ప్రచారానికి రావాలని ఎప్పుడూ అడగలేదు’’ అన్నారు. సీనియర్ ఎన్టీఆర్‌కు ప్రతిష్టాత్మకమైన భారతరత్న వస్తే సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో అది త్వరగా రావాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.

Related Posts

బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘ఆదిత్య 369’ రీరిలీజ్ డేట్ ఫిక్స్

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అత్యంత ప్రతిష్ఠాత్మంగా తీసుకుని నటించిన చిత్రం ‘ఆదిత్య 369(Aditya 369)’. ఇది ఇండియన్ సినిమాలోనే ఫస్ట్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్(First Time Travel Science Fiction) మూవీ. దిగ్గజ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు(Srinivasa Rao) 1991లో…

Vishwambhara: వింటేజ్ లుక్‌లో మెగాస్టార్.. ‘విశ్వంభర’ నుంచి ఫొటో రివీల్!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).. ఆరుపదుల వయసులోనూ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా అదే ఉత్సాహంతో నటిస్తున్నారు. వరుసబెట్టి మరీ సినిమాలు చేసేస్తున్నారు. అటు ఆయన వేసే స్టెప్పులకూ తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన బింబిసార ఫేమ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *