Kingdom: రౌడీబాయ్ సినిమాలో మరో స్టార్ హీరో.. పోస్టర్ రివీల్ చేసిన మేకర్స్

రౌడీబాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా, గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా సినిమా ‘కింగ్‌డమ్(Kingdom)’ నుంచి సత్యదేవ్(Satya Dev) కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సత్యదేవ్ క్యారెక్టర్ పోస్టర్‌(Poster)ను గురువారం సాయంత్రం విడుదల చేసి, అభిమానుల్లో ఉత్సాహం నింపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, రెండు భాగాలుగా విడుదల కానుంది. పోస్టర్‌లో సత్యదేవ్ ఇంటెన్స్ లుక్‌(Satyadev’s intense look)లో కనిపించారు. ఈ మేరకు ‘తుఫానులాంటి భయంకరమైన వ్యక్తి.. త్వరలో బిగ్ స్క్రీన్‌పైకి రాబోతున్నాడు.. హ్యాపీ బర్త్‌డే శివ’ అంటూ అతని పాత్రను రివీల్ చేశారు.

Big TV Live for Entertainment News, సెలబ్రిటీ అప్డేట్స్ & మూవీ న్యూస్ in  Telugu

పోస్టర్ విడుదలతో సినిమాపై పెరిగిన అంచనాలు

కాగా ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్యదేవ్ పాత్ర కథలో కీలక మలుపును తీసుకురానుందని తెలుస్తోంది. ఈ పోస్టర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఫిబ్రవరి 12న విడుదలైన టీజర్‌లో NTR వాయిస్ ఓవర్ అభిమానులను ఆకట్టుకుంది. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చాయి.మొదట మే 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం, ప్రమోషన్(Promotions) కార్యక్రమాల్లో ఆటంకాల కారణంగా జులై 4కి వాయిదా పడింది. ఆ తర్వాత అనివార్య కారణాలవల్ల ఈ నెల 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *