Anupama Parameswaran: ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ‘పరదా’ ట్రైలర్ రిలీజ్

అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘పరదా’ ట్రైలర్(Paradha Trailer) ఈ రోజు (ఆగస్టు 9) సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో హీరో రామ్ పోతినేని చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వంలో ఆనంద్ మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ(Vijay Donkada), శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘పరదా’ కథ ఒక విచిత్రమైన ఊరి చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ అమ్మాయిలు తమ ముఖాలను పరదాతో కప్పుకుంటారు.

Image

హృదయాన్ని హత్తుకునే ఉద్వేగాలతో..

టీజర్ ప్రకారం, ఒక అమ్మాయి ఆ ఊరిని దాటి బయటకు వచ్చి కొత్త స్నేహితుల(Friends)తో జీవితాన్ని ఆస్వాదిస్తుంది. అయితే, ఆ ఊరిలో ఒక అంతుచిక్కని సమస్య ఉద్భవిస్తుంది, దాని వెనుక రహస్యం ఏమిటన్నది కథలో ఆసక్తికర భాగం. ఈ సినిమా స్త్రీ సాధికారత, స్వాభిమానం వంటి సామాజిక అంశాల(Social aspects)ను చర్చిస్తూ హృదయాన్ని హత్తుకునే ఉద్వేగాలతో రూపొందిందని అనుపమ తెలిపారు. ట్రైలర్ విడుదల వార్త సినీ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్(Teaser), ‘ఎగరేయి నీ రెక్కలే’ వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ట్రైలర్ కథలోని మరిన్ని మలుపులను, భావోద్వేగాలను వెల్లడిస్తుందని భావిస్తున్నారు. ‘పరదా’ అనుపమ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *