Plane Crash: ఎయిరిండియా ప్రమాదంలో 265 మంది మృతి.. స్పందించిన అమెరికా 

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన(Air India plane crash)ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు. ‘భారత్(India) చాలా పెద్ద, బలమైన దేశం. ఈ పరిస్థితిని వాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోగలరు. అయితే మా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా తక్షణమే అక్కడకు వస్తామని చెప్పా’ అని ట్రంప్ తెలిపారు. విమానయాన చరిత్రలో అహ్మదాబాద్(Ahmadabad) ఘటనను ఒక ఘోరమైన ప్రమాదంగా ఆయన అభివర్ణించారు. ‘ఇది చాలా ఘోరమైన క్రాష్. అసలు ఇదేంటో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. నేను కూడా నా ఆలోచనలను వారికి చెప్పా. విమానం బాగానే వెళ్తున్నట్లు కనిపించింది. కానీ అంతలోనే ఇలా జరిగింది. అసలు పేలుడు జరుగుతుందని కూడా అనిపించలేదు. ఇంజిన్లు శక్తి కోల్పోయినట్లు మాత్రమే అనిపించింది’ అని ట్రంప్ పేర్కొన్నారు.

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ప్రమాదం

కాగా గురువారం (జూన్ 12) మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్(Air India flight takes off) అయిన కొద్ది సేపటికే జనావాసాల్లో కుప్పకూలిపోయింది. ఈ విమానంలో 12 మంది సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు ఉండగా.. ప్రయాణికుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 241 మంది మరణించగా.. విమానం కూలిన భవనంలో ఉన్న మెడికోలు 24 మంది మరణించారు. మొత్తం 265 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు వదిలారు.

సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగానే ప్రమాదం జరిగిందా?

ప్ర‌మాదానికి గురైన విమానంలో 169 మంది భార‌తీయులు, 52 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీసు వాళ్లు, ఒక కెనడియన్ వ్య‌క్తితో పాటూ 12 మంది విమానంలో ప‌నిచేసే సిబ్బంది ఉన్నార‌ని తెలిపింది. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ప్ర‌క‌టించింది. ఇదిలా ఉంటే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగా ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *